చెన్నై వరద బాధితుల కోసం "నేను సైతం" అంటున్న రకుల్ ప్రీత్ సింగ్
భారీ వర్షాల కారణంగా నానా ఇబ్బందులకు గురవుతున్న చెన్నై వాసులకు మన తెలుగు కథానాయకులు ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది ఆర్ధికంగా ఆదుకొంటుండగా, మరికొంతమంది వారికి అత్యవసరమైన నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి ఆహార పదార్థాలను చెన్నైకి పంపిస్తూ తమకు కుదిరినంతలో సహాయం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ జాబితాలో కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరుతోంది. తనవంతు సాయంగా 5000 మందికి సరిపడా ఆహారపదార్థాలతోపాటు మంచినీటిని అందిస్తోంది. కథానాయికగా తనను ఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు తనవంతు సాయం అందిస్తున్నట్లు చెప్పింది.