సంబంధిత వార్తలు
- 'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్బ్లోయింగ్, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా
- 'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు
- Peddi Sales: ఇండియాలో పెద్ది ప్రీ-సేల్స్ 22 కోట్ల కు చేరిందా !
- Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్
- Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రదర్శనలు
ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్స్లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొంది, గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది చిత్రం ఆన్లైన్ టిక్కెట్స్ బుకింగ్స్లో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఈ చిత్రం గంటకు 40 వేల టిక్కెట్లు అమ్ముడు పోతున్నాయి.
ఈ చిత్రం రిలీజ్కు ముందు నుంచే టికెట్ బుకింగ్స్లో జోరు చూపిన చిత్రం విడుదల అనంతరం కూడా అదే కొనసాగిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో ''పెద్ది''కు గంటకు 40 వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. 2023లో బుక్మై షో ప్రవేశపెట్టిన 'అవర్లీ ట్రెండింగ్' (గంటల వారీ ట్రెండింగ్) ఫీచర్ తర్వాత.. ఈ 40 వేల మార్క్ను దాటిన చిత్రాల జాబితాలో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్, పుష్ప తర్వాత స్థానంలో 'పెద్ది' నిలిచింది. మొదటిరోజే ఈ మార్క్ను చేరుకొని రికార్డు సృష్టించింది.
కర్ణాటకలో జరిగిన ప్రీమియర్ షోల ద్వారా 'పెద్ది' భారీ వసూళ్లను సాధించి, టాలీవుడ్లోని పలు అగ్రహీరోల చిత్రాల రికార్డులను తిరగరాసింది. ప్రీమియర్స్లో రూ.3.2 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అక్కడ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. గతంలో విడుదలైన 'ఓజీ' (రూ.2.72 కోట్లు), 'రాజా సాబ్' (రూ.2.61 కోట్లు), 'పుష్ప-2' (రూ.2.55 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
