గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2015 (14:40 IST)

నాయకి ప్రెస్ మీట్ తర్వాత త్రిష రానాను కలిసిందా? తెల్లారేదాకా రాలేదా?

బిజినెస్‌మెన్ వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్‌ కంటే ముందే రానా, త్రిషల మధ్య ప్రేమాయణం నడుస్తోందని జోరుగా ప్రచారం సాగింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇంతలో వరుణ్ మణియన్ ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు కానీ.. వచ్చినట్టే వచ్చి త్రిషతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. తర్వాత వచ్చిన దార్నే వెళ్లినట్లు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయాడు. 
 
అయితే త్రిష నిశ్చితార్థానికి ధనుష్ కారణమని కొందరంటుంటే.. మరికొందరు రానానే కారణమంటున్నారు. ధనుష్ నిశ్చితార్థానికి హాజరు కావడం వరుణ్‌కి ఇష్టం లేదని.. ఈ విషయాన్ని త్రిష వద్ద అడగటంతో గొడవ పెద్దదై ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యిందని తెలిసింది. కానీ రానాతో సంబంధాలు తెలుసుకునే వరుణ్ ఎంగేజ్‌మెంట్ని రద్దు చేసుకున్నాడని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. 
 
ఈ వార్తలు నిజమే అన్నట్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న త్రిష హ్యాపీగా ఉన్నానని, సింగిల్‌గా ఉన్నానని, ప్రస్తుతానికి సినిమాలపై దృష్టి పెట్టాటని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న రానాను అప్పుడప్పుడు కలవడం ద్వారా ఏదో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన కష్టాలు చెప్పుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే యవ్వారం వేరేలా ఉంది. 
 
త్రిష-రానా ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారని, పార్టీలకు, పబ్‌లకు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని టాక్ వస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నాయకి ప్రెస్‌మీట్‌కు వచ్చిన త్రిష నేరుగా రానాను కలిసిందని టాక్. అంతేకాదు.. ఇద్దరూ ఎప్పటిలాగానే పబ్బులకు వెళ్లి తెల్లారే వరకు ఇంటికి చేరుకోలేదట. దీనిపై త్రిష ఏమంటుందో మరి?