శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 28 జులై 2016 (16:25 IST)

''భాగమతి'' అనుష్కకు తల్లిగా టబు: నదియాను అనుకున్నారు కానీ.. టబునే ఫిక్స్ చేస్తారా?

బాహుబలి 2 షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటూనే అనుష్క భాగమతి సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "పిల్ల జమిందా

బాహుబలి 2 షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటూనే అనుష్క భాగమతి సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "పిల్ల జమిందారు'' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క లేడి ఓరియెంటెడ్ పాత్రధారిగా నటిస్తున్న అనుష్కకు తల్లి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ముందు అనుష్క తల్లి పాత్రలో అత్తారింటికి దారేది, మిర్చి ఫేమ్ నదియాను అనుకున్నారట. కానీ టబు అంతే పాత్రకు సరిపోతుందని టాక్ వస్తోంది. చారిత్రక అంశాలకు సస్పెన్స్, థ్రిల్లర్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం టబుతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇప్పటికే రమ్యకృష్ణ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీ బిజీగా ఉండగా ప్రస్తుతం టబు కూడా రెండో ఇన్నింగ్స్‌లో మెరిసే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ నచ్చడంతో టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇకపోతే.. తెలుగులో బాలకృష్ణ సరసన టబు నటించిన చివరి చిత్రం "పాండు రంగడు''. ఈ సినిమా రిలీజై 8 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో.. రెండో ఇన్నింగ్స్ టబు బాగా కలిసొస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.