మెంటల్కృష్ణ, రాజావారి చేపల చెరువు వంటి చిత్రాల ద్వారా హీరోగా ముద్రవేసుకున్న ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి గాలిశీను ద్వారా తెరపైకి రానున్నారు. పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి స్వప్నమూవీస్ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్ను హనీఫ్ అనే నూతన నటుడు పోషిస్తుండగా, మెంటల్ కృష్ణ ఫేమ్ సత్యకృష్ణన్ మళ్లీ గాలిశీనులో హీరోయిన్గా నటించడం విశేషం. వీధి రౌడీ నుంచి డాన్ స్థాయికి ఎదగాలనుకునే రౌడీ కథే గాలిశీను అని దర్శకుడు తెలిపారు. చక్కటి హాస్యభరిత చిత్రంగా గాలిశీను తెరకెక్కనున్నాడని ఆయన తెలిపారు.