తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శేషాద్రి చిన్న శేషవాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.