వెండితెరకన్నా బుల్లితెర ఎక్కువ ఆదరణ పొందుతుందని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. పాప్కింగ్ మైఖేల్ జాక్సన్కు కూడా గుర్తింపు లభించింది బుల్లితెరపైనేనని గుర్తుచేశారు. ఏడాదిపాటు సినిమాలు చేసినా బుల్లితెరపై వచ్చే సీరియల్స్కు ఎంతో గుర్తింపు, పలుకుబడి వస్తోందని, సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై దాసరి నారాయణరావు సమర్పణలో దాసరి పద్మ నిర్మిస్తోన్న అభిషేకం సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో విలేకరుల సమావేశంలో పై విధంగా మాట్లాడారు.