Believe It Or Not

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం



రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?రైలు ప్రయాణీకులకు హిజ్రాలు నరకం చూపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్దకు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వకుంటే నానా యాగీ చేస్తున్నారు. కొంతమంది తమవద్ద డబ్బు లేదని చెబితే వారిపై భౌతిక దాడులు సైతం చేస్తున్నారు. తన్నులు తిన్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోతే వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు. వారు చేస్తున్న ఈ చర్యలన్నిటినీ అనునిత్యం సోషల్ మీడియాలో షేర్ అవుతూనే వున్నాయి. మరి ఈ వీడియోలు రైల్వే అధికారుల దృష్టికి రావడంలేదా? ప్రయాణికుల భద్రతపై ఉదాసీన వైఖరి ఎందుకు వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులుఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించగా, 4,853 కేసులు నమోదయ్యాయని మంగళవారం లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధిక మరణాలను నమోదు చేయగా, తెలంగాణలో అత్యధిక కేసులను నమోదు చేసింది. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, 2026-31 కాలానికి గాను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిర్వహణ మార్గదర్శకాలలో భాగంగా... వడగాలులు, పిడుగుపాటులను నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో హోం శాఖ చేర్చిందని ఆయన పేర్కొన్నారు.

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.