Cricket News

Notifications

  1. క్రీడలు
  2. క్రికెట్



నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియోమహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పండరీపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అక్కడి దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా కనబడుతున్నాయి. బావి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను బైటకు తీస్తుండగా స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రక్షణ లేని బావిలో పికప్ వాహనం పడిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారని వారు చెబుతున్నారు. పండరిపురం సమీపంలో ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యాత్రికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి వాహనం అదుపుతప్పి, ఎలాంటి రక్షణ గోడ లేని లోతైన బావిలో పడిపోయింది. ఆలయంలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తూ, రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సోమవారం నాడు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి జరిగింది. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన డేటా ప్రకారం, పరీక్ష లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి అన్ని మిషన్ లక్ష్యాలను సాధించి, కీలక సాంకేతికతలను ధృవీకరించడంతో పాటు, భారతదేశం పెరుగుతున్న సుదూర ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు