Cricket Previous Series

Notifications

  1. క్రీడలు
  2. క్రికెట్
  3. గత సిరీస్



దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనంమేడ్చల్ జిల్లాలోని దుండిగల్ గ్రామంలో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన ఒక రాతి శాసనం లభించింది. ఈ శాసనం ఒక స్తంభం మూడు వైపులా తెలుగు-కన్నడ లిపి, కన్నడ భాషలో 41 పంక్తులుగా చెక్కబడి ఉంది. అంతేకాకుండా, శాసనం ప్రారంభంలో చంద్రుడు, సూర్యుడు, ఒక జైన తీర్థంకరుడు, దూడతో ఉన్న ఆవు చిత్రాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నర్సాగరి జగన్ అనే వ్యక్తికి లభించిన శాసనాన్ని, పరిశీలన కోసం కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌కు పంపారు. మధ్యలో విరిగిపోయినట్లుగా ఉన్న ఈ శాసన స్తంభాన్ని, దుండిగల్‌లోని ఒక చిన్న చెరువు వద్ద నుండి ఆలయానికి తీసుకువచ్చినట్లు ఆలయ పూజారి తెలిపారు.