Fengshui

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్



మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసు

మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసువైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సమయంలో విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తిన 21 మంది వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో బూర్జ ఎస్ఐ ప్రవల్లికపై అముదాలవలస వైకాపా ఇన్‌చార్జ్ చింతాడ రవి కుమార్, ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఒక మహిళ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలో మొత్తం 21 మంది వైకాపా నేతలపై ఆముదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో చింతాడ రవికుమార్‌ను ఏ1గా పేర్కొన్నారు. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ఏపీ మహిళా సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా వాసి ఒకరు తాను మృతి చెందుతూ అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌ అయిన జిల్లాలోని కడెం మండలం, కొండుకూర్‌కు చెందిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో ఆయన గుండె చప్పుడు ఆగినా మరికొందరి జీవితాల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఈ మానవతా నిర్ణయానికి యశోద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెల్యూట్ చేశారు. ఆవయవదానం ఒక జీవితానికి ముగింపు కాదు. ఎన్నో జీవితాలకు కొత్త ప్రారంభమే సందేశాన్ని ఈ కుటుంబం ఆచరణలో చూపించిందని అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్

ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ, ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వీసీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్‌లో ప్రవేశం కల్పించడంత నియామకాలు - ప్రవేశాల్లో యధేచ్చగా ఉల్లంఘనలు, సివిల్ పనుల్లో అవకతవకలతో పాటు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్‌, విచారణ కమిటీల నివేదికల్లో తేలింది. వీటి ఆధారంగా సస్పెన్షన్‌ వేటు వేశారు. జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సివుండగా, తన రిటైర్మెంట్ ఆఖరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు.

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. స్నేహసంబంధాలు, వ్యాపకాలు అధికమవుతాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్తయత్నాలకు సన్నాహాలు సాగిస్తారు. నోటీసులు అందుతాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ తగదు. సన్నిహితుల సలహా పాటించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వస్త్ర, వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మహిళలు ఆషాఢ మాసంలోని శుక్రవారాల్లో 'ఆషాఢ శుక్రవార లక్ష్మీ పూజ వ్రతంను ఆచరిస్తారు. 2026 సంవత్సరంలో, ఈ ఆషాఢ శుక్రవార లక్ష్మీ వ్రతం జూలై 31, ఆగస్టు 7 తేదీలలో జరుపుకోబడుతుంది. శాక వ్రతం అని కూడా పిలువబడే ఈ వ్రతం, సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. కొందరు ఆషాఢ మాసం అంతా లక్ష్మీ పూజను ఆచరిస్తారు. మరికొందరు ఆషాఢ శుక్ల దశమి నాడు పూజను ప్రారంభించి, శ్రావణ మాస శుక్ల దశమి నాడు ముగిస్తారు. చాలామంది ఆషాఢ మాసంలోని శుక్రవారాల్లో మాత్రమే ఈ పూజను నిర్వహిస్తారు. కొందరు వరలక్ష్మి పూజ రోజున దీనిని ముగిస్తారు.

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.