Health Information

Notifications

  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు



మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీవెండితెరపై మరోమారు పుష్పరాజ్ (అల్లు అర్జున్), శ్రీవల్లి (రష్మిక మందన్నా) జోడీ సందడి చేయనుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాకా పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంల దీపికా పదుకొణె హీరోయిన్. అయితే, ఈ చిత్రంలో రష్మిక మందన్నా కూడా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రష్మికకు సంబంధించిన సన్నివేశాలను త్వరలోనే ముంబైలో చిత్రీకరించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.