MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మావిగన్ (MAVIGUN - Machilipatnam, Vijayawada, Guntur) ప్రకటన గతంలోనే విమర్శలకు గురైంది. దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే మిన్నకుండిపోయారు. ఈ నేపధ్యంలో మరోసారి మావిగన్ మా నినాదం, ఏపీ రాజధాని మావిగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు తెరలేపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను తెరపైకి తెస్తూ, దీనినే తమ 2029 ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయానికి ఛైర్మన్, సభ్యులను నియమించి కొత్త ఆలయ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో ఉన్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కూడా ఉన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండివైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
దారుణం, 13 ఏళ్ల బాలికపై 5 రోజుల్లో 30 మంది అత్యాచారం
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రాష్ట్రంలోని శ్రీగంగానగర్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆటోరిక్షా నడిపే ఓ డ్రైవర్ ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పట్టణంలో కొన్నిచోట్ల తిప్పి అనంతరం ఆమెను ఓ హోటల్ యజమానికి అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ హోటల్ యజమాని బాలికతో వ్యభిచారం చేయించాడు. 5 రోజుల్లో ఆమెపై 30 మంది అత్యాచారం చేసారు. కాగా హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాలికతోపాటు మరో 10 మంది యువతులను రక్షించారు.
Satyadev: మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్ అందుకే వారిలా చేయగలిగా :సత్యదేవ్
కొత్త రకం సినిమాలు తమిళం, మలయాళం నుంచి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి కొత్త రకం సినిమాలు లేవని ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. అలాంటి వారందరికీ రావు బహదూర్ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అని కథానాయకుడు సత్యదేవ్ తెలిపారు.
బడ్జెట్ ధరకు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ - ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ కంపెనీ తాజాగా ఎన్ సిరీస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకురానుంది. వన్ ప్లస్ ఎన్6 పేరుతో మార్కెట్లోకి జూన్ 4వ తేదీ నుంచి అందుబాటులోకి తేనుంది. ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 6360 చిప్సెట్తో తయారుచేశారు. అలాగే, 8000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ఈ ఫోనుకు ప్రధాన ఆకర్షణ కావడం గమనార్హం. అయితే, ఈ ఫోన్ను ఎల్.సి.డి డిస్ప్లేతో తీసుకుని రావడం గమనార్హ.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?




















