Nri

Notifications

  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.



ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపుదేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. తొలుత విద్యార్థులకు ఎప్పుడూ తన మద్దతు వుంటుందని పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిన్న అర్థరాత్రి ఇచ్చిన సందేశం తర్వాత సల్మాన్ ఖాన్ విద్యార్థులను ఉద్దేశించి ఓ విజ్ఞప్తి చేసారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి భద్రతే ఈ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న సల్మాన్ ఖాన్, ఇక ఆందోళనలు విరమించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని విద్యార్థులకు, నిరసనకారులకు విజ్ఞప్తి చేసారు. విద్యార్థులకు వారి చదువు, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం. కనుక ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇదే అంశంపై గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు ఇప్పటికే ట్వీట్ చేసారు.

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై జోస్యం చెప్పేందుకు ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి ముందుకొచ్చారు. సీజేపీకి అక్టోబర్ 31 వరకు ఒక క్రేజ్.. ఆ తర్వాత మరోరకమైన క్రేజ్ వస్తుందని ఆయన అన్నారు. ఈ పార్టీ వల్ల బీజేపీకి, మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని వేణుస్వామి జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో దేశంలో ఓ పార్టీని గద్దె దింపడం లేదా గద్దెనెక్కించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. రాశి చక్రాల ప్రకారం బొద్దింకల పార్టీని బలప్రయోగంతో అణచివేయాలని చూస్తే వ్యవహారం రివర్స్ అవుతుందని వేణు స్వామి అన్నారు. యుద్ధవాతావరణంలో వీళ్లను హ్యాండిల్ చేయడం కష్టం.. ప్రేమతో వీరిని దారికి తెచ్చుకోవాలి.. అగ్రెసివ్‌గా వెళ్తే మరింత తీవ్రమవుతుందని వేణు స్వామి హెచ్చరించారు.

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీవిద్యార్థులను కేంద్ర ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం దేశ శత్రువుల్లా చూస్తోందని, విద్యార్థుల ధైర్యానికి ప్రభుత్వం జవాబుదారీతనంతో స్పందించాల్సిందిపోయి, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచివేస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలు, విద్యా సంస్కరణల కోసం విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం వారిని దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులుగా చూస్తోందని విమర్శించారు.