Nri News

Notifications

  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు



ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియో

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియోఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. 21 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఐతే పరుపుల వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, ఆయన కుమారుడు అర్మాన్ తీసుకున్న నిర్ణయంతో వారు 8మంది ప్రాణాలను కాపాడగలగడమే కాకుండా హోటల్ పైఅంతస్తుల నుంచి కిందికి దూకినవారికి తీవ్ర గాయాలు కాకుండా చేసింది. రియాజుద్దీన్, అర్మాన్ మానవత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. మంటల్లో చిక్కుకున్న భవనంలో బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీలు, బాల్కనీల నుండి దూకవలసి వచ్చినప్పుడు, రియాజుద్దీన్ తన దుకాణంలోని సుమారు 20 నుండి 25 పరుపులు కింద పరిచాడు.

సముద్రంలో రక్తం అలలు అలలుగా వచ్చాయి, అంతా వేడుకలా చూసారు, ఏమైంది?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. నేను సైకిల్ తొక్కుతాను.. బాబు పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. నేను సైకిల్ తొక్కుతాను.. బాబు పిలుపుప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న తాను సైకిల్ తొక్కుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఒక సందేశంలో, పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు సైకిళ్లు, ఈ-సైకిళ్లను (విద్యుత్ సైకిళ్లను) వినియోగించాలని ముఖ్యమంత్రి కోరారు. శుక్రవారం విశాఖపట్నంలో పర్యటన సందర్భంగా, తాను సైకిల్‌పై ప్రయాణిస్తూ, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అందరూ ఏకం కావాలని, తనకు సహకారం అందించాలని బాబు తెలియజేశారు.

హీరోతో ముద్దు సన్నివేశం.. భర్తను తోడుతెచ్చుకున్న హీరోయిన్.. ఎవరు? (video)

కుట్రలు, కుతంత్రాలను అధిగమించి బ్లాక్‌బస్టర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది: నట్టి కుమార్