త్వరలో ఓ సరికొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం రాబోతోందనీ, దాని పరిధిలో విదేశాలలో పనిచేస్తున్న భారత ఉద్యోగులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి వయలార్ రవి పేర్కొన్నారు. విదేశాలలో భారతీయ కార్మికులపై జరుగుతున్న దోపిడీ, అక్రమాలను నిరోధించేందుకు రూపొందించిన ఈ కొత్త ప్రవాస బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.