దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అమెరికాలోని లూసియానాలో గల సదరన్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ లాంటి ప్రజా నాయకుడిని కోల్పోవటం దురదృష్టకరమనీ, ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఈ సందర్భంగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.