Telugu Cartoons

Notifications

  1. వినోదం
  2. హాస్యం
  3. కార్టూన్లు



నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్య

నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్యబెట్టింగ్. ఈ వ్యసనంలో పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు ఎంతగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా కొంతమంది మాత్రం ఆ వ్యసనం నుంచి బైట పడలేకపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఓ డాక్యుమెంట్ రైటర్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడు క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్... తదితర వ్యసనాలకు 35 ఏళ్ల షేక్ సుభాని బానిసయ్యాడు. దీనితో అందినకాడికి అప్పులు చేసాడు. బెట్టింగ్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులవాళ్లు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గోల చేస్తుండటంతో ఏ దారి లేక చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?యూపీలో పెళ్లి పీటలపై ఆగిపోయింది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. కానీ పెళ్లి ఆగకుండా వుండేందుకు ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

షాకింగ్, వైసిపితో కాంగ్రెస్ పొత్తు? అన్నాచెల్లెళ్లు జగన్-షర్మిల కలిసి పనిచేయనున్నారా?

షాకింగ్, వైసిపితో కాంగ్రెస్ పొత్తు? అన్నాచెల్లెళ్లు జగన్-షర్మిల కలిసి పనిచేయనున్నారా?రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. దక్షిణాదిలో.. అంటే కేరళం, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కొన్నిచోట్ల పొత్తుల రూపంలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డీకె శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వైసిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఆరాటపడుతున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఇప్పటికే 4 రాష్ట్రాలు గుప్పెట్లో వున్నాయి కనుక ఏపీని కూడా లాగేస్తే ప్రధానమంత్రిగా పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం అవుతుందని రాహుల్ గాంధీ తలపోస్తున్నట్లు సమాచారం.

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమినిలూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలువేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.