Telugu Culture

Notifications

  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి



కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?

కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి, భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామం శివార్లలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో దివ్యవాణి (32) అనే మహిళ మరణించింది. దివ్యవాణి తల్లి స్వస్థలం భిక్కనూర్ మండల కేంద్రం కాగా, ఆమె పదేళ్ల క్రితం నిజామాబాద్ పట్టణానికి చెందిన అరవింద్‌ను వివాహం చేసుకుంది. గత కొద్ది నెలలుగా కుటుంబ గొడవల కారణంగా, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భిక్కనూర్‌లో నివసిస్తోంది. సెప్టెంబర్ 11న, దివ్యవాణి తన ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లి తిరిగి రాకపోవడంతో, ఆమె తండ్రి మధు ఆందోళన చెంది స్థానిక భిక్కనూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిక్కనూర్ పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్