Telugu Literature

Notifications

  1. ఇతరాలు
  2. సాహిత్యం



నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్య

నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్యబెట్టింగ్. ఈ వ్యసనంలో పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు ఎంతగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా కొంతమంది మాత్రం ఆ వ్యసనం నుంచి బైట పడలేకపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఓ డాక్యుమెంట్ రైటర్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడు క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్... తదితర వ్యసనాలకు 35 ఏళ్ల షేక్ సుభాని బానిసయ్యాడు. దీనితో అందినకాడికి అప్పులు చేసాడు. బెట్టింగ్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులవాళ్లు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గోల చేస్తుండటంతో ఏ దారి లేక చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?యూపీలో పెళ్లి పీటలపై ఆగిపోయింది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. కానీ పెళ్లి ఆగకుండా వుండేందుకు ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

షాకింగ్, వైసిపితో కాంగ్రెస్ పొత్తు? అన్నాచెల్లెళ్లు జగన్-షర్మిల కలిసి పనిచేయనున్నారా?

షాకింగ్, వైసిపితో కాంగ్రెస్ పొత్తు? అన్నాచెల్లెళ్లు జగన్-షర్మిల కలిసి పనిచేయనున్నారా?రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. దక్షిణాదిలో.. అంటే కేరళం, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కొన్నిచోట్ల పొత్తుల రూపంలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డీకె శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వైసిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఆరాటపడుతున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఇప్పటికే 4 రాష్ట్రాలు గుప్పెట్లో వున్నాయి కనుక ఏపీని కూడా లాగేస్తే ప్రధానమంత్రిగా పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం అవుతుందని రాహుల్ గాంధీ తలపోస్తున్నట్లు సమాచారం.