Vegetarian Food

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం



ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియోధనం మూలం ఇదం జగత్... ఈ ప్రపంచానికి ధనమే ప్రధానం, మరేమీ కాదని మరోసారి నిరూపుణ అయ్యింది. ఎటు చూసినా బురదతో శ్మశాన వాతావరణంతో కనబడుతోంది నేపాల్ వరద ప్రాంతం. కొంతమందివి మృత కళేబరాలు బురదలో ఇరుక్కుపోయి, ఇంకొందరివి నదీ తీరానికి కొట్టుకు వచ్చి కనబడతున్నాయి. ఆ మృత దేహాల నుంచి ఆభరణాలను లాక్కుంటూ పలువురు పోటీపడుతున్నారు. మరికొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారిని రక్షించడం మాని... ప్రవాహంలో పడి వేగంగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల కోసం పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ స్థితిని గమనించినప్పుడు ఎప్పట్లాగే ప్రకృతి మిగిల్చిన విషాదంలో మానవత్వం మరణించింది అనిపిస్తుంది.

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనం

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనంభారత ప్రభుత్వం చాలా కాలంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యాక, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచిన తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందడం కేవలం సమయానుకూల విషయం మాత్రమే. అయితే, అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఇప్పటికే దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో పెరగనున్న 265 మంది ఎమ్మెల్యేలు, 116 మంది కౌన్సిల్ సభ్యులకు సరిపడా వసతి కల్పించేలా, అత్యాధునిక హంగులతో ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ధృవీకరించారు.

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులునేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదల్లో వందలమంది గల్లంతయ్యారు. చాలామంది ఆచూకి ఇప్పటివరకూ లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఆచూకి ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడకు చెందిన ముగ్గురు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరి ఆచూకి తెలియాల్సి వుందన్నారు. ఐతే కర్నూలు నుంచి మానససరోవర్ యాత్రకు వెళ్లిన వారంతా సురక్షితంగా వున్నారనీ, వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా పలువురు పర్యాటకులు వెళ్లినట్లు సమాచారం. ఐతే వీరి సంఖ్య ఎంత అన్నది తెలియాల్సి వుంది.

గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమవుతూ గల్లంతైనవారి వివరాలను వెల్లడించిన సద్గురు, మిన్నంటిన రోదనలు, వీడియో

Allu Arjun Forbes India: ఫోర్బ్స్ ఇండియా షో స్టాప‌ర్స్‌ 2026 ఎడిషన్ కవర్‌పై అల్లు అర్జున్