పసుపు ఒక దివ్య ఔషధంగా ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, పడిశం, ఫ్లూ వంటి వాటికి పాలలో పసుపును కలుపుకుని సేవిస్తే వెంటనే తగ్గిపోతుంది. ఈ పసుపు ప్రయోజనాలను పరిశీలిస్తే..
webdunia
పసుపు కలిపిన పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పసుపు పాలు తాగితే జలుబు, ఫ్లూ తగ్గుతాయి.
వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి పసుపు పాలు.
ఎండుమిర్చి కలిపి తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
పాలకు అరకప్పు గోరువెచ్చని పాలలో పసుపు, చిటికెడు ఎండుమిరియాల పొడి కలపాలి.
మీరు తీపి లేకుండా త్రాగలేకపోతే, బెల్లం, ఒక చుక్క నెయ్యి వేయవచ్చు.
గ్యాస్పై పాలను కాచిన తర్వాత వాటికి కాస్త పచ్చి పసుపు వేసి కలపాలి.
గమనిక: వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఉపయోగించండి.