తిరుమలలోరద్దీ సాధారణం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 73,745 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 9 నిండాయి. వారికి 5గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా మంగళవారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.