రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్తో బజ్ను సృష్టించింది. అన్ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికితోడు వాయుగుండం తరుముకొస్తుండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల కొండపై భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ వర్షానికి తోడు చలి తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. శ్రీవారి నామస్మరణ చేస్తూ నిత్యం భక్తులతో కిటకిటలాడే మాడ వీధులు ఇపుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా భక్తులు షెడ్లలోనే తలదాచుకుంటున్నారు.