పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే 'బ్రో' మూవీకి సీక్వెల్ రూపొందిస్తామని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. బుధవారం చెన్నైలో ఆయన ప్రధాన పాత్రను పోషించిన 'కార్మేని సెల్వం' చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'బ్రో' సీక్వెల్ ప్రారంభించడం అనేది తన చేతుల్లో లేదన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వగానే రెండో భాగం ప్రారంభిస్తానని తెలిపారు. కాగా 'బ్రో' మొదటి భాగం గత 2023లో రాగా, ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద, ఒక ప్రైవేటు బస్సు టిప్పర్ లారీని ఢీకొన్న ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరిన ఆ బస్సు, చేరుకోవడానికి ఇంకా సుమారు ఒక గంట ప్రయాణం మిగిలి ఉండగా, గురువారం ఉదయం 6 గంటల తర్వాత ఈ ప్రమాదం సంభవించింది.