యువ తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, ప్రధాన పాత్రలో వరుసగా మూడు రూ. 100 కోట్ల చిత్రాలను అందించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ యువ నటుడు నెలకొల్పిన ఈ రికార్డు నిజంగా అసాధారణమైనది.
కేవలం మూడు చిత్రాలతోనే ఇంతటి గొప్ప కీర్తిని గడించడంతో, ప్రదీప్ తన తదుపరి చిత్రంతో కూడా అద్భుతాలు సృష్టిస్తాడని ప్రేక్షకులు ఆశించడం సహజమే. కానీ, అతని తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆలయంలో దైవదర్శనానికి వెళ్లేందుకు కొన్ని నిబంధనలు వుంటాయి. ఆ నిబంధనలను అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది. ఐతే ఈ విషయంలో కొన్నిచోట్ల చిన్నపాటి ఘర్షణలు, మరికొన్నిచోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల ఆలయ పరిధిలోనూ ఇదే జరిగింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఓ యువతి చున్నీ వేసుకోకుండా దర్శనానికి వెళ్లేందుకు క్యూలో నిలబడింది.
ఇది గమనించిన మహిళా సెక్యూరిటీ గార్డు ఆ భక్తురాలిని చున్నీ వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి.... చున్నీ వేసుకోనంత మాత్రాన నేనేమైనా నీకు అసభ్యంగా కనిపిస్తున్నానా అంటూ ఆమెపై వాగ్వాదానికి దిగింది.