బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్వీర్కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
విశాఖపట్నంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులోనే ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు, పార్వతీపురం సమీపంలో ప్రయాణిస్తున్న ధన్బాద్ - పొదనూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది.
రూర్కెలా నుండి జోలార్పేట వైపు వెళ్తున్న రైలు నంబర్ 16620లోని ఎస్8 బోగీలో తన భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఆ మహిళకు, రైలు రాయగడ దాటిన కాసేపటికే తీవ్రమైన ప్రసవ వేదన మొదలైంది.