తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఆదాయంలో వాటా విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమ్మర్ సీజన్లో విడుదల కావాల్సిన పలు క్రేజీ సినిమాల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది.
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు వెళ్ళే జాలర్లకు లక్ష రూపాయల మేరకు అపరాధం విధిస్తామని జాలర్ల గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ మేరకు తీర్మానం చేశారు. తమ తీర్మానాన్ని ఉల్లంఘించిన వెళ్లిన వారికి ఏకంగా లక్ష రూపాయల జరినామా విధిస్తామని హెచ్చరించారు. ఇస్కపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన జాలర్లు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.