మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా బాలీవుడ్ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతను తనను వేధించాడని వాపోయింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తతో పాటు మీడియా ముందుకు వచ్చిన మోనాలిసా మిశ్రా వల్ల తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బట్టబయలు చేసింది.
ప్రయాగరాజ్ కుంభమేళా ఫేమ్ మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను సినిమా రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా వివాహాన్ని లవ్ జీహాద్తో పోల్చాడు.
ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్ర మంత్రివర్గం మార్చి 28న సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యేలా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే, దానిని కేంద్ర మంత్రివర్గానికి, పార్లమెంటుకు పంపుతుంది.