ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ఎలా వున్నదో వేరే చెప్పక్కర్లేదు. ఐతే ఆ పరిశ్రమలో ఉద్యోగాలను వదిలేసి హీరోయిన్లుగా మారిన వారు వున్నారు. వారిలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కయదు లోహార్ కాంసెట్రిక్స్ కంపెనీలో ఐటీ జాబ్ వదిలేసి సినీ హీరోయినుగా అరంగేట్రం చేసింది. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసేది. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. మరో టాప్ హీరోయిన్ శ్రీనిధి షెట్టి కూడా ఐటీ జాబ్ వదిలేసి సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని టాప్ స్టార్ అయ్యింది. ఇలా ఐటీ ఇండస్ట్రీని వదిలేసి వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు వీరంతా.
కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంగళవారం పాడా కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది.