మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఏప్రిల్ 2న ఆమోదించింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో, ఏ చట్టమైనా పూర్తి స్థాయి చట్టంగా మారడానికి అనుసరించే సాధారణ ప్రక్రియ ప్రకారం, రాష్ట్రపతి ఆమోదం కోసం దీనిని భారత రాష్ట్రపతికి పంపించారు.