'నాగబంధం' నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “నమో రే” పాట విడుదలైంది. దర్శకుడు అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, కళాత్మక సంపదను ప్రతిబింబించేలా రూపొందుతోంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్మగౌరవ ప్రతీకగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ప్రతిష్టించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.