ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్గా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ భారతదేశమంతటా ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన, కమర్షియల్ సక్సెస్ఫుల్ స్టార్స్లో కరైన అల్లు అర్జున్తో, భారీ చిత్రాలను లార్జ్ స్కేల్లో రూపొందించే ఫిల్మ్ మేకర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువల్ ఎక్స్పీరియెన్స్డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది.
గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి, కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా వీటిని నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.