టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు అయిన విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై నుంచి మాట్లాడుతూ... ఇన్నిరోజులుగా మనసులో దాచుకున్నాను. సందర్భం వచ్చింది కనుక చెప్పక తప్పడంలేదు.
నా అన్వేషణ పేరుతో ప్రపంచ దేశాలను చుడుతూ వాటిని తన సోషల్ మీడియా పేజీల్లో పెడుతూ కోట్లు ఆర్జిస్తూ వచ్చిన అన్వేష్కి బిగ్ షాక్ తగిలింది. సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు వున్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీనికి కారణం ఇటీవలే అన్వేష్ వ్యాఖ్యలు నేపధ్యంలో అతడిపై ఫిర్యాదుల వెల్లువలా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. దేశాన్ని దూషించాడంటూ ఫిర్యాదులు రావడంతో అది కాస్తా ఇన్ స్టాగ్రాం యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అతడి అకౌంటుని క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.