ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇకలేరు. 92 యేళ్ల వయసులో ఆమెకు గుండెపోటు, ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే, తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆశా భోంస్లే... నిజ జీవితంలో జరిగిన ఒక తీరని విషాదం ఆమెను జీవితాంతం వెంటాడింది. అదే ఆమె కుమార్తె వర్షా భోంస్లే. ఈ ఘటనతో ఆశా భోంస్లే మానసికంగా కుంగిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత నాదెండ్ల భాస్కర్ రావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు, ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కార్యాలయం స్పందించింది. నాదెండ్ల భాస్కర రావు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.