‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఈ రాజధాని కోసం 29 వేలమంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. కేపిటల్ ప్రాంతానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలనీ, నిధులను సమకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అమరావతి రాజధానికి నిధులు ఇవ్వాలి. అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలి.