ఆదిత్య ధర దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ రెండో భాగం కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తోంది. తాజాగా గత తొమ్మిదేళ్ళుగా బాహుబలి పేరిట ఉన్న కలెక్షన్ల రికార్డును ధురంధర్ అధికమించింది. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ధురంధర్ తన హవాను కొనసాగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలి అని పార్టీ కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.