బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్వీర్కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
తన ప్రజా సంప్రదింపుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారంనాడు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తన 85వ ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి అందిన అనేక రకాల విజ్ఞప్తులకు ఆయన స్పందించారు.
వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు, టీడీపీ శ్రేణులు తమ సమస్యలను స్వయంగా మంత్రి దృష్టికి తీసుకురావడానికి పార్టీ ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారి సమస్యల పరిష్కారంపై లోకేష్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.