హైటెక్సిటీలోని నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో- నిర్మాత రానా దగ్గుబాటి, నెట్ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ పాల్గొన్నారు.
దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. స్వయంగా రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగించదు. ఆమె మాజీ వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి మేనకోడలు. అలేఖ్య సాయి రెడ్డి భార్య సోదరి కుమార్తె.
ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే, తాను రాజకీయాల్లో రావడం ఖాయమని.. అయితే ఇంకా ఏ పార్టీలో చేరాలనేదానిని నిర్ణయించలేదనేదే అలేఖ్య చేసిన ప్రకటన.