పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథ కూడా వినలేదని ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా అన్నారు. పవన్ - రాశీఖన్నా - శ్రీలీలలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు.
మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నవారు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారిని సైకోలు అంటుంటారు. విశాఖపట్టణంలో ఇలా వింతగా ప్రవర్తించే ఓ వ్యక్తి పోలీసు పెట్రోల్ వాహనాన్ని దొంగిలించి కారు, ఆటోలను ఢీకొట్టాడు. అతడు నడుపుతున్న జీపును పోలీసులు వెంబడిస్తుండటంతో వాహనాన్ని వదిలేసి చెరువులో దూకేసాడు. దీనితో అతడిని బైటకు తీసుకుని వచ్చేందుకు దాదాపు 3 గంటల పాటు అగ్నిమాపక దళం మరియు పోలీసులు శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.