ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు గుండెపోటుతో పాటు గుండె ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇటీవల కడప జిల్లాలో పులివెందులలో అల్లర్లకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన పోకిరీలకు పోలీసులు తగినశాస్తి చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో పోలీసులు తగిన ట్రీట్మెంట్ ఇచ్చి, వీధుల్లో నడిపించారు. ఈ నెల 8వ తేదీన తాగిన మత్తులో వీరంగం సృష్టించి, స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన వారిని గుర్తించి అరెస్టు చేశారు. వీరికి పులివెందుల పట్టణ సీఐ శ్రీరామ్, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్తో కలిసి పోకిరీలను నడి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పులివెందుల పూల అంగళ్ల కూడలి నుంచి వారిని నడిపిస్తూ ఘటన జరిగిన పాత బస్టాండు వరకు వచ్చారు. ఇది పులివెందులలో చర్చనీయాంశమైంది.