మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా బాలీవుడ్ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతను తనను వేధించాడని వాపోయింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తతో పాటు మీడియా ముందుకు వచ్చిన మోనాలిసా మిశ్రా వల్ల తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బట్టబయలు చేసింది.
ప్రయాగరాజ్ కుంభమేళా ఫేమ్ మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను సినిమా రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా వివాహాన్ని లవ్ జీహాద్తో పోల్చాడు.
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ దగ్ధమైంది. ప్రమాదంలో 14మంది సజీవ దహనం కాగా, మరో పాతిక మంది గాయపడ్డారు.
బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.