ఇటీవల రామాయణం, హిందూ ధర్మపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. రామాయణంపై తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వేదికగా ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన తన 76వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఏపీలోని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈవోకు ఆమె చెక్కును అందజేశారు.