కోలీవుడ్ హీరో ఆర్య ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినీ దర్శకుడు బాలా ఒక సినిమాలో గాడిదలా నటించాలని తనను కోరితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పాత్ర చేస్తానని ఆర్య అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం మిస్టర్ ఎక్స్. మను ఆనంద్ దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్య మాట్లాడారు. ఒకవేళ ఏదైనా సినిమాలో గాడిదలా నటించమని బాలా అడిగితే.. ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరిస్తానని తెలిపారు.
విశాఖపట్టణం సాయి కిరణ్ అనే యువకుడితో తనకు సంబంధం వుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని శాంతి కుమారి ప్రశ్నించడంతో ఆమెపై దాడి జరిగిందనీ, ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో విశాఖపట్నం పోలీసులు గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ఒక పార్టీలో స్నేహితుల చేతిలో దాడికి గురైన 28 ఏళ్ల అకుమర్తి శాంతి కుమారి, విశాలాక్షి నగర్లోని ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
అరెస్ట్ అయిన వారిని పుచ్చ సాయి కిరణ్, రంపా లక్ష్మి, జయశ్వంత్, సాయి కుమార్, నరవ సాయి కుమార్ గా గుర్తించారు.