హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, తమ నమ్మకమైన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'మైఖేల్' బయోపిక్ను ప్రదర్శించింది. మాల్ లోపలి పీవీఆర్ లక్స్లో ఆహ్వానితులకు మాత్రమే ప్రత్యేకంగా మైఖేల్ బయోపిక్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం కోసం ఆడిటోరియం మొత్తాన్ని ప్రత్యేకంగా తమ లాయల్ కస్టమర్ల కోసం ఇనార్బిట్ మాల్ కేటాయించింది.
కేవలం సినిమా చూసే కార్యక్రమం కంటే ఎక్కువగా రూపొందించబడిన ఈ అనుభవం, మాల్ యొక్క అత్యంత విలువైన కస్టమర్లను, అత్యధికంగా ఖర్చు చేసే లాయల్టీ కస్టమర్లతో పాటు, పలు పోటీల ద్వారా ఎంపిక చేసిన కొందరు విజేతలను ఒకచోట చేర్చింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాకముందు దానవీరశూరకర్ణంగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కుంభకర్ణుడుగా మారిపోయారని విమర్శించారు. రైతుల గురించి సీఎం రేవంత్రెడ్డి స్పీచ్లు, డైలాగ్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే.. 'రైతు భరోసా'ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.