బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్వీర్కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సోమవారం రాత్రి రాయపూడిలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పైపులను దగ్ధం చేశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించడంతో పాటు కారణాలు నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ.. వరుస అగ్ని ప్రమాదాలు చూస్తుంటే.. కుట్ర కోణం ఉందనే అనుమానం వస్తోందన్నారు. ఆ దిశగా మరింత లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలని స్పష్టం చేశారు.