భారతీయ బాక్సాఫీస్ను ఏలడానికి వస్తున్న సోదరులు అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్. ఫొటోలు కనబడ్డాయి. అవి ఒరిజినలా. ఎ.ఐ. అనేది పక్కన పెడితే వీరి కాంబినేషన్ కలయిక మరో ఆర్.ఆర్.ఆర్. సినిమాను తలపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనో, ఆస్కార్ అవార్డు సందర్భంగా ఇలా కనిపించారనేది కూడా తేటతెల్లం కాలేదు. అయితే వీరి కలయిక మాత్రం మరలా వస్తే మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా జరిగిన వరుస దోపిడీలు, దొంగతనాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై, మధ్యప్రదేశ్కు చెందిన గిరిజన ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.