ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారనీ, బండిపైన ఆటో ఎక్కించి, మనుషులు అంతా ఎక్కి ఎండలో దానిని వైసిపి నాయకులు బాధపెట్టారంటూ యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసిపి నిరసన చేపట్టింది. ఈ క్రమంలో వైసిపి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎడ్లబండిపై ఆటోను, మనుషులను ఎక్కించి ప్రయాణం చేసారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ వీడియోను చూసిన రష్మి... ఆ ఎద్దు అనుభవించిన వేదన, ఈ మనుషులు వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించాలని పేర్కొంది.
సైనస్ సమస్య కారణంగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేసుకుని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.