బిగ్ బాస్ ఫేం, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తనపై నమోదైన చీటింగ్ కేసు వ్యవహారంలో తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా వార్తలు రాస్తే మాత్రం ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తానంటూ హచ్చరించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లె వద్ద ఉన్న టోల్ప్లాజా సిబ్బందిపై తన సొంత పార్టీ టీడీపీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.