దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. హాలీవుడ్లో ప్రముఖ నటుల కంటే దర్శకులకే ఎక్కువ పేరు, గౌరవం ఉంటాయని, కానీ బాలీవుడ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.