మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయిపోయింది మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోన్స్లే. తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోనాలిసా ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడు ఫర్మాన్ ఖాన్తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరిగాయో దానికి ఏకైక కారణం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ను పైకి లేపడం, లోకేష్ చంద్రబాబును పైకి లేపడం అని జగన్ సెటైర్లు చేశారు. ఈ వ్యక్తులు జాకీలను ఉపయోగించి ఒకరినొకరు పైకి లేపడం తప్ప, 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వేరే ఏదీ జరగలేదన్నారు.