ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ భిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే గ్లింప్స్ విడుదలయింది. మంచి స్పందన వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు.
తొలుత ఓనూరు జంక్షన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.