ఆర్థిక నేరస్థుడు సుఖేశ్ చంద్రశేఖర్కు రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్గా మారేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. అయితే, ఇందుకోసం ముందుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సంప్రదించాలని నటికి న్యాయస్థానం సూచించింది.
ఓ గ్రామానికి చెందిన చిన్న చర్చిలో పాస్టర్గా వుంటున్న ఘంటా జాన్ బాబూరావు ఇంట్లోని ఓ గదిలో అన్నీ రూ. 500 నోట్ల కట్టలు సుమారు రెండున్నర కోట్ల వరకూ బైటపడటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పీచుపాలేనికి చెందిన ఓ చర్చిలో గంటా జాన్ బాబూరావు పాస్టర్ గా వుంటున్నారు. ఐతే ఆయన ఇటీవలి కాలంలో భారీగా ఆస్తులు కొంటున్నట్లు తెలిసింది.
ఒక్కసారిగా ఆస్తులను ఆర్జించేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని గ్రామ ప్రజల చర్చించుకోవడం ప్రారంభమైంది.