ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. నగరం నడిబొడ్డున కోట్లు ఖర్చు చేసి వేసిన ఒక భారీ సెట్లో ప్రస్తుతం ఒక అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ను రంగంలోకి దించారు. రాజమౌళి గ్రాండియర్, మహేశ్బాబు గ్రేస్, బాస్కో స్టెప్పులు కలిస్తే థియేటర్లో విజువల్ ఫీస్ట్ పక్కా అనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుసంపన్నం, అభివృద్ధి పథంలో పయనించేలా నడిపించేందుకు అవసరమైన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, నిరంతర శక్తి లభించాలని గవర్నర్తో పాట వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.