ప్రధానిగా నరేంద్ర మోడీ, మన దేశ సైనిక బలగాల వల్లే దేశ ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటూ సినీ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడి చేయడంతో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు ఒక పోలీసు అధికారి సోమవారం తెలిపారు. శనివారం నాడు ఆ వృద్ధురాలు తన వ్యవసాయ పొలాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలు జారి కిందపడగా, ఆ వెంటనే కోతులు ఆమెపై దాడి చేశాయని పోలీసులు పేర్కొన్నారు.