హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా bఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది.
అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పట్టుకెళ్తున్నారూ, భవిష్యత్తులో ఈ రాజధాని ఇక్కడే వుంటుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడుతూ... గతంలో మనం ఎక్కడ నుంచి వచ్చాము? మద్రాసు నుంచి కర్నాలుకి వచ్చాము. అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాదుకి వెళ్లాము. ఇప్పుడు అక్కడ్నుంచి అమరావతికి వచ్చాము. భవిష్యత్తులో అమరావతి నుంచి మరెక్కడికైనా వెళ్తామేమో... ఎవరికి తెలుసు? కనుక ఒకే ప్రాంతంలో రాజధాని వుండాలంటూ బంధించడం రాజ్యాంగ విరుద్ధం.