సోషల్ మీడియాలో కొన్నేళ్ళుగా చక్కర్లు కొడుతున్న ఓ ఫోటోపై పవర్ స్టార్ పపన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా క్లారిటీ ఇచ్చారు. అపుడెపుడో ఓ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొనివున్న మహిళను తాను కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాఖాతాలో ఓ పోస్టును షేర్ చేశారు.
తన అత్తమామలు తన సొంత కొడుకు కంటే తన తోటి కోడలి నాలుగేళ్ల కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసూయతో, తోటి కోడలి బాలుడికి యాసిడ్ తాగించింది. ఈ కేసులో నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితురాలు, ఆ బాలుడి తల్లి ఇద్దరూ అన్నదమ్ములను వివాహం చేసుకుని, ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు.
తన కొడుకును చంపాలనే దురుద్దేశంతో, ఏప్రిల్ 9న వంటగదిలో పండ్ల రసం ఇస్తాననే సాకుతో నిందితురాలు తన కొడుకుకు యాసిడ్ తాగించిందని ఆ బాలుడి తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రసం తాగితే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి, నిందితురాలు ఆ బాలుడిని నమ్మించింది.