ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య, మాజీ నటి రేణు దేశాయ్, ఆదిత్య ధర్ రూపొందించిన ధురందర్: ది రివెంజ్ చిత్రంపై తన సమీక్షను పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేస్తూ, ధురందర్-2 చిత్రం ప్రారంభంలో ప్రదర్శించిన భగవద్గీత శ్లోకాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మన సాయుధ దళాల పట్ల, మన గూఢచార సంస్థల పట్ల మీకు కనీసం ఒక్క రవ్వంత గౌరవం ఉన్నా సరే.. ఎందుకంటే, మన దేశం గురించి ఇతరులు అర్థంలేని మాటలు మాట్లాడుతుంటే, మనం మాత్రం వారి వల్లే మన సౌకర్యవంతమైన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తూ, నిద్రపోగలుగుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేసమయంలో పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఈ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు.