డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ , జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ రోజు, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ను రివిల్ చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలంలో ఉన్న ఉద్దండరాయునిపాలెం గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో కలిసి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత వేదిక వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.