సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘వాలా 2’ తెలుగులో నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ హీరో తేజసజ్జా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగంగా ఒకరినొకరు సోదరులుగా సంబోధించుకుంటారు. వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత అనుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అత్యంత గౌరవం, పరస్పర అభిమానం ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జగన్, కేటీఆర్ తమ రాజకీయ జీవితాలకు సంబంధించి కూడా దాదాపు ఒకే రకమైన సవాలును ఎదుర్కొంటున్నారు.