గాజువాకలో నీట్ అభ్యర్థి సెర్చ్ చేసి ఆత్మహత్య.. బ్యాగులో మూర్ఛకు ట్యాబ్లెట్లు
నీట్ విద్యార్థి గాజువాకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం నాడు గాజువాకలోని ఒక కోచింగ్ సెంటర్లో నీట్ అభ్యర్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సౌత్ జోన్ సిఐ వాసు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లికి చెందిన రమేష్, శ్రీలక్ష్మిల కుమారుడైన రూపేష్ (19) నీట్ లాంగ్-టర్మ్ కోచింగ్ కోసం పాత గాజువాకలోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చేరాడు. అతను ప్రతిరోజూ అనకాపల్లి నుండి కోచింగ్ సెంటర్కు వచ్చేవాడు. శుక్రవారం కూడా అతను యథావిధిగా కోచింగ్ సెంటర్కు వచ్చాడు.
Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో
ద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు.
దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిక్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
ఏరా నీక్కూడా ఆ అమ్మాయే కావాల్సిచ్చొందా? చావు అంటూ హత్య చేసిన ఫ్రెండ్
ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఎంతో కలిసిమెలిసి వుంటుండేవారు. ఐతే ప్రేమ వ్యవహారం కాస్త వీరి మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా హత్య వరకూ తీసుకుని వెళ్లింది. స్నేహితుడు అని కూడా చూడకుండా తను ప్రేమించిన అమ్మాయి తనకు మాత్రమే దక్కాలని అతడిని అతి దారుణంగా చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారి పిప్రహా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఇస్రార్, అతడి స్నేహితుడు ఆశిష్ ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. ఇది ఒకరికొకరు తెలుసుకున్నారు.
ఆ అమ్మాయి నాదేనంటే నాదే అంటూ గొడవపడ్డారు. ఇక ఇట్లా లాభం లేదనుకున్న ఆశిష్ ఒక పథకం రచించాడు.
లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, బెదిరింపులు - మహిళా ప్రొడక్షన్ వర్కర్స్ ఆవేదన
హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలపై లెక్కలు అడిగిన సభ్యులను అవమానిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్లో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి తమ వాదనను వెల్లడించారు.
పదేళ్ల ప్రస్థానంలో తెలుగు నేలపై జియో డిజిటల్ సునామీ, తెలుగు రాష్ట్రాల్లో 3.3 కోట్ల యూజర్లు
హైదరాబాద్: పది సంవత్సరాల క్రితం, 2016 సెప్టెంబర్ 5న, రిలయన్స్ జియో భారత్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించి, ప్రజలు ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా జీవిస్తారు అనే విషయాలను మార్చిన ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని ఉన్న విస్తారమైన టెలికమ్యూనికేషన్ సేవా ప్రాంతంలో దీని ప్రభావం పూర్తిగా నిర్మాణాత్మకంగా, సామాజికంగా వచ్చిన పునర్జన్మ లాంటిది. గత పది సంవత్సరాల్లో ఈ ప్రాంత మార్కెట్ తీవ్ర డిజిటల్ కొరత నుంచి డిజిటల్ సమృద్ధికి మారింది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?























