ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. ఈ గణేశుడుకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు తొలి పూజ చేశారు.
#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం
దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగను ప్రజలు భక్తిప్రపత్తులతో సోమవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకచవతి వ్రత కథ, గణపతి జననం గురించి తెలుసుకుందాం.. పూర్వం పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారుచేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తాను స్నానానికి వెళ్తూ గుమ్మం వద్ద కాపలా ఉంచింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పరమశివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. దాంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలంతో బాలుని శిరచ్ఛేదం చేశాడు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిమహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్లోని లీ మెరిడియన్లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం - బీర్ పార్టీకి పిలిచి రాడ్తో కొట్టి హత్య
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బీజేపీ నేత మేనల్లుడిని అతడి స్నేహితుడే కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. సెప్టెంబరు 7వ తేదీన హర్యానా రాష్ట్రంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీ సమీపంలో జితేంద్ర (40) అనే వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు... జితేంద్ర మామ, బీజేపీ నేత ఉత్తమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్యతో జితేంద్రకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడి స్నేహితుడు ప్రవీణ్ ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసి చంపేసినట్టు తేలింది.
Balakrishna's entry : దాదా షూటింగ్ లో నందమూరి బాలక్రిష్ణ ఎంట్రీ - కలెక్టర్ గా కాజల్ అగర్వాల్
దాదా గా బాలక్రిష్ణ, కలెక్టర్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఎన్.బి.కె.111.. దాదా. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. దాదా గా వుండి సమాజంలో వుండే అపసవ్య పద్ధతుల్ని సవ్యంగా చేసే పాత్రలో నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్నారు. తనున్న ఊరిలో బాలబాలికల హాస్టల్ లో పిల్లలకు పెట్టే భోజనంలో అవినీతి జరిగిందని తెలిసిన కలెక్టర్ కాజల్ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం.
కృత్రిమ మేధపై మనుషులు నియంత్రణ లేకపోలేతే అది వృధానే : సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ)పై మనుషులు నియంత్రణ లేకపోతే అది వృధానే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అన్నారు. ఇటీవల ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెమ్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్లు మాట్లాడుతూ, సైబర్ దాడులు, అక్రమ నిఘా, జీవాయుధ పరిశోధనల వంటి హానికరమైన కార్యకలాపాలకు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రమాదం పొంచివుందని వారు అభిప్రాయపడ్డారు. ఇపుడు వారితో మైక్రో సాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ కూడా ఏకీభవించి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























