బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఈ హెచ్చరిక జారీ అయింది. రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ తీరానికి చేరుకున్నాయి.
ఐఎండీ ప్రకారం, శని, ఆదివారాల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు నమోదయ్యాయి. విస్తృత వర్షపాతానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.