కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయన్ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా జరిగింది. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన వైద్య చికిత్సను సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ అందిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డా.శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బి.రెడ్డి, వారి కూతురు అక్షత, తదితరులు పాల్గొన్నారు.
వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురుదైంది. ఏపీలో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అపెక్స్ కోర్టు నిరాకరించింది. అలాగే, ఈ కేసులో లొంగిపోయేందుకు కూడా అదనపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పనిలోపనిగా ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.