దసరా తర్వాత రాజకీయ పార్టీని ప్రకటిస్తాను: విజయసాయి రెడ్డి
అసలైన రెడ్డి వర్గీయుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఏకం చేసేలా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. తన పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశి రోజున తన పార్టీని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
Radha Ashtami 2026: శనివారం పూట రాధా అష్టమి రావడం విశేషం.. ఇలా పూజ చేస్తే?
సెప్టెంబర్ 19, 2026 శనివారం, రాధా అష్టమి (భాద్రపద శుక్ల అష్టమి)తో కలిసి వస్తుంది. ఇది ఒక అసాధారణమైన పవిత్రమైన రోజు. ఇది శనివారం, రాధా అష్టమి రెండూ కావడం వల్ల, ఈ తేదీన పూజ చేయడం వలన విశిష్ట ఫలితాలు లభిస్తాయి.
శనివారం శ్రీవారిని ఇంకా అష్టమి తిథి రావడంతో కాలభైరవుడిని పూజించడం ద్వారా శని దేవుని ద్వారా కర్మ సంబంధిత అడ్డంకులను తొలగించబడతాయి. ఇంకా రాధాకృష్ణుల అనుగ్రహం లభిస్తుంది. రాధా అష్టమి శ్రీ రాధ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మధ్యాహ్న ముహూర్తంలో (ఉదయం 11:19 నుండి మధ్యాహ్నం 1:45 వరకు) రాధాకృష్ణులను పూజించడం వల్ల ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిపిల్లలకే కాదు, పెద్దలకూ వ్యాక్సిన్లు అవసరం
హైదరాబాద్: వ్యాక్సినేషన్ చిన్నారులతోనే ఆగిపోకూడదని, పెద్దలు కూడా తమ వయసు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్లు తీసుకోవాలని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ వైద్యులు సూచించారు. పెద్దల్లో వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి అడల్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు మీడియా సమక్షంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుని పెద్దలకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అడల్ట్ ఇమ్యునైజేషన్ కార్డును కూడా ప్రారంభించారు. పెద్దలు తాము తీసుకున్న వ్యాక్సిన్ల వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు, వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇతర రిస్క్ ఫ్యాక్టర్ల ఆధారంగా అవసరమైన వ్యాక్సిన్లపై వైద్యులతో చర్చించేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది.
భర్తను రాయితో కొట్టి చంపి.. వేడి నూనె పోసిన భార్య.. ఆపై ఏం జరిగింది?
విజయనగరంలో ఓ మహిళ భర్త పట్ల కిరాతకురాలిగా మారింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కండిపేటలో గురువారం ఉదయం ఒక మహిళ తన భర్తను రాయితో కొట్టి చంపి, ఆపై అతనిపై వేడి నూనె పోసిందని సమాచారం. అనంతరం ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. మృతుడిని డి. శ్రీనుగా, నిందితురాలిని డి. రాములమ్మగా గుర్తించారు.
ప్రేమనే ఊరిలో సినిమాకు లాభాలు రావాలని కోరుకుంటున్నా - కామాక్షి భాస్కర్ల
చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు.
ఆపిల్ నుంచి ఐఫోన్ 18, ఐఫోన్ 15రిలీజ్: 2027 ప్రథమార్థంలో విడుదలయ్యేవి ఏంటంటే?
యాపిల్ ఇటీవల ఐఫోన్ డుయో, ఐఫోన్ 18 ప్రో సిరీస్, ఎయిర్పాడ్స్ 5, ఇయర్బడ్స్, కొత్త స్మార్ట్వాచ్ల వంటి కీలకమైన ఉత్పత్తులను విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది, 2027 ప్రథమార్థంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఆ సంస్థ సన్నద్ధమవుతోంది.
ఈ దిగ్గజ సాంకేతిక సంస్థ తన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులలో పలుంటిని అప్డేట్ చేయనుంది. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ఈ కొత్త ఉత్పత్తుల విడుదల యాపిల్ను స్మార్ట్-హోమ్ స్క్రీన్ల వంటి పూర్తిగా కొత్త రంగాల్లోకి తీసుకువెళ్లనుంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























