తాజాగా విష్ణు మంచు భక్త కన్నప్ప సొంతూరికి వెళ్లారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచుకి, కన్నప్ప టీంకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అభివృద్ది చేస్తానని కూడా విష్ణు మంచు హామీ ఇచ్చారు.
పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశం నుండి తిరిగి వస్తుండగా జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గా ప్రసాద్ మరణించారు. అమలాపురం నివాసి దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆకస్మికంగా మరణించినట్లు సమాచారం. ఆ కార్యకర్త మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"దుర్గా ప్రసాద్ మరణ వార్త నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.." అని పవన్ అన్నారు. దుర్గా ప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దుర్గా ప్రసాద్ మరణానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.