తెలుగులో శుభం అనే సినిమాతో నిర్మాతగా మారిన సమంత సక్సెస్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. రాజ్ & డికె తో పార్టనర్ గా తీసిన సినిమా అది. ఇటీవలే విడుదలైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అందులో కాస్త శ్రుతిమించిన కేరెక్టర్ అయినా నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ పొందింది కూడా.
తాజా మరో వెబ్ సిరీస్ ను చేయనుంది. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ అది. దర్శకద్వయం రాజ్ & డికె తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు.