ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. ఈ గణేశుడుకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు తొలి పూజ చేశారు.
ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిస్పృహః
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి
భావం: ఎవరైతే సకల కోరికలను, 'నాది' అనే మమకారాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి జీవిస్తారో, వారు మాత్రమే నిజమైన శాంతిని, మనో స్వేచ్ఛను పొందుతారు.
భయానికి మూలం మమకారమే
వస్తువులు లేదా వ్యక్తులపై తీవ్రమైన ఆసక్తి పెంచుకున్నప్పుడు, వాటిని ఎక్కడ కోల్పోతామోననే 'భయం' పుడుతుంది. ఆ భయమే మనిషి మనశ్శాంతిని, ఆనందాన్ని హరించివేస్తుందని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిచక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము.
చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం.
ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం.
భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం.
చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం.
పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం.
రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం.
బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం - బీర్ పార్టీకి పిలిచి రాడ్తో కొట్టి హత్య
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బీజేపీ నేత మేనల్లుడిని అతడి స్నేహితుడే కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. సెప్టెంబరు 7వ తేదీన హర్యానా రాష్ట్రంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీ సమీపంలో జితేంద్ర (40) అనే వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు... జితేంద్ర మామ, బీజేపీ నేత ఉత్తమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్యతో జితేంద్రకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడి స్నేహితుడు ప్రవీణ్ ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసి చంపేసినట్టు తేలింది.
Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి కాకా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి సామాజిక అంశాన్ని ఎంచుకున్నారు. కాకా చిత్రంలో అమ్ములు పాపగా అనస్వర రాజన్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు లాడ్జిలో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.
కృత్రిమ మేధపై మనుషులు నియంత్రణ లేకపోలేతే అది వృధానే : సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ)పై మనుషులు నియంత్రణ లేకపోతే అది వృధానే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అన్నారు. ఇటీవల ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెమ్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్లు మాట్లాడుతూ, సైబర్ దాడులు, అక్రమ నిఘా, జీవాయుధ పరిశోధనల వంటి హానికరమైన కార్యకలాపాలకు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రమాదం పొంచివుందని వారు అభిప్రాయపడ్డారు. ఇపుడు వారితో మైక్రో సాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ కూడా ఏకీభవించి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?























