శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు - సర్వదర్శనానికి 24 గంటలు
కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వరుసగా వారాంతపు సెలవులు రావడంతో భక్తులు తిరుమల కొండపైకి పోటెత్తారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలువలికి విస్తరించి బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల పాటు పడుతోంది.
Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో
ద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు.
దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిగర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
కాళ్లపారాణి ఆరకముందే నవ వరుడు ప్రాణాలు తీసిన మలుపు
ఓ నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లికి అత్తింటివారు కొనిచ్చిన ద్విచక్రవాహనానికి సంబంధించిన పత్రాలను షోరూమ్ నుంచి తీసుకొస్తుండగా, ఓ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువు ఆశలను ఆవిరైపోయాయి. ఆ నవ దంపతుల ఊహలను చెరిపేసి ఆమెకు కన్నీటి వేదన మిగిల్చింది.
Karthi: సర్దార్ చూశాక వాటర్ బాటిల్ ప్లాంట్స్ని రానివ్వమని గట్టిగా అరిచారు : కార్తి
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో ‘సర్దార్ 2’ తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి సినిమా విశేషాలను పంచుకున్నారు.
సెప్టెంబర్ 24న ఫ్లిప్కార్ట్లో మివి వన్ తొలి స్మార్ట్ఫోన్ విడుదల, కొనేస్తారంతే...
హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్కామ్, ఫ్లిప్కార్ట్ మరియు గూగుల్లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్తో స్మార్ట్ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్డ్రాగన్ 5G చిప్సెట్తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్ఫోన్ కానుంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?























