నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్ను ఆశ్రయించిన కోడలు
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన వ్యవహారం తరచుగా మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. వరకట్న వేధింపులు, ఇతర గృహ హింస ఆరోపణలు చేస్తున్న ఆ కుటుంబ కోడలు మేఘన, తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆశ్రయించారు.
ఆమె గవర్నర్ను కలిసి, ఆర్థిక ప్రయోజనాల కోసం తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న జోగి రమేష్ కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తన కుటుంబం వివాహం కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసింది.
Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?
సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే.
పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే...
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో
ఎప్పుడూ రైళ్లలోనో లేదంటే ఎక్కడైనా ఫంక్షన్ల వద్దనో డబ్బులు అడుగుతూ కనిపిస్తుంటారు కొంతమంది హిజ్రాలు. మరికొందరైతే ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుండటం చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలోని అలందీలోని ఇంద్రాయణి నదీ తీరం వద్ద ఆదివారం మధ్యాహ్నం భక్తుల నుండి భిక్షను స్వీకరించే విషయంలో హిజ్రాల మధ్య రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ రెండు గ్రూపులు కూడా ఈ భిక్ష తమకు చెందాలంటే తమకే చెందాలంటూ పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, హిజ్రాలలో ఒక గ్రూపుకి చెందిన వారు సెప్టెంబరు 6న మధ్యాహ్నం సమయంలో భక్తుల నుండి భిక్ష సేకరిస్తుండగా, తాము సేకరించిన స్థలంలో మీరెలా వస్తారంటూ వాదనకు దిగింది.
Naga Chaitanya: ఫౌజీ తో తలపడుతున్న నాగ చైతన్య వృషకర్మ చిత్రం
గత వారం రోజుల్లో దాదాపు నాలుగు సినిమాలు ఫౌజీ తో పోటీ పడనున్నట్లు ప్రకటించాయి. నాగ చైతన్య ‘వృషకర్మ’ విడుదల తేదీ డిసెంబర్ 4, 2026 గా ప్రకటించారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన పౌరాణిక థ్రిల్లర్ ‘వృషకర్మ’, డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని చైతన్య బుధవారం తెలిపారు. ఈ చిత్రంలో ఆయన సరసన మీనాక్షి చౌదరి నటించగా, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్ కీలక పాత్రలలో నటించారు.
ఐఫోన్ డ్యూయో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు... 5 నిమిషాల ఛార్జింగ్తో 5 గంటల వీడియో ప్లేబ్యాక్ (video)
ఐఫోన్ డ్యూయో స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఒకసారి పరిశీలిద్దాం.. ఐఫోన్ డ్యూయో ప్రపంచవ్యాప్తంగా కేవలం ఈ-సిమ్ సపోర్ట్తో మాత్రమే వస్తుంది. ఫోన్ బ్యాటరీకి ఎక్కువ స్పేస్ కల్పించడం కోసం ఫిజికల్ సిమ్ సపోర్ట్ను తొలగించినట్లు కంపెనీ చెబుతోంది. దీని లోపల 7.6-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉంది. ఇది ఐఫోన్ 18 ప్రో 6.3-అంగుళాల స్క్రీన్ కంటే 80 శాతం పెద్దది. మధ్యలో కనిపించే మడత గీతలను తగ్గించడానికి, ప్రతిబింబాన్ని తగ్గించడానికి దీనికి కస్టమ్ నానో టెక్స్చర్ ఫినిష్ ఉంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























