పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈనెల 19న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. నటుడు మహేష్ వైపు శ్రీలీల సీరియస్గా చూసిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని నాటకం సృష్టించిందే సునీతారెడ్డి అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాల్ని సునీత పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు.