ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు. 92 ఏళ్ల వయసులో ఆదివారం ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమెను శనివారం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆశా భోస్లే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఇంకా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించారని డాక్టర్ ప్రతీత్ సమదానీ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత నాదెండ్ల భాస్కర్ రావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు, ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కార్యాలయం స్పందించింది. నాదెండ్ల భాస్కర రావు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.