టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ జగన్నాథ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసారు. నటి శ్యామల వుంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటికీ వెళ్లి ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు.
పావలా శ్యామల వయోభారం తెచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గతంలో తను ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. తన దీన స్థితిని తెలియజేస్తూ ఇటీవల వీడియో ద్వారా అభ్యర్థించారు.
టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ను హైలైట్ చేస్తూ టీడీపీ మెంబర్షిప్ రికార్డు ప్రధాన పేజీ ప్రకటనను సాక్షి ప్రచురించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డబ్బు సంపాదించడానికి సాక్షి ప్రత్యర్థులకు తలవంచడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు అవమానంగా భావిస్తున్నారు.