కుమారుడిని చూసి నవ్విన పాపానికి.. తండ్రిని హత్య చేశాడు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో బుధవారం రాత్రి ఒక వ్యక్తిని అతని కుమారుడే హత్య చేశాడు. తనను చూసి హేళనగా నవ్వాడన్న కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం, మాణిక్యరాయనిపల్లెకు చెందిన చెంగారెడ్డి (55)కి జోకేశ్ రెడ్డి, హేమచంద్ర రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జోకేశ్ రెడ్డి, అదే మండలంలోని ఎల్లంపల్లె సమీపంలో ఉన్న ఒక గ్రావెల్ ఫ్యాక్టరీలో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య చూడామణి పెనుమూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారు పెనుమూరులో నివసిస్తున్నారు.
Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)
నేపాల్లో ఆకస్మిక వరదలు రావడానికి కొన్ని రోజుల ముందు పలాంచోక్ భగవతి అమ్మవారి విగ్రహం నుండి నీటి బిందువులు (అంటే చెమట లాగా) కారిన సంఘటనను భక్తులు ఒక దైవిక హెచ్చరికగా నమ్ముతున్నారు. నేపాల్లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో కొండ శిఖరంపై ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేపాల్లోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది.
ఈ ఆలయంలో ఉన్న భగవతి అమ్మవారి విగ్రహం ఒకే నల్లరాతితో అందంగా చెక్కబడిన మూడు అడుగుల ఎత్తు కలిగినది. ఈ అమ్మవారి విగ్రహం పద్దెనిమిది చేతులతో దర్శనమివ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది, అంటే సుమారు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ భగవతి అమ్మవారు, నేపాల్లోని ఇతర భగవతి అమ్మవార్లందరికీ పెద్దగా పరిగణించబడుతుంది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిడిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది.
భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు
పంజాబ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన హత్య జరిగింది. పట్టపగలే అందరూ చూస్తూ వుండగానే 20 ఏళ్ల యువకుడిని అతడి బావమరుదులు ఇద్దరే హత్య చేసారు. బస్టాండ్ వద్దకు రాగానే అతడి కోసం కాపు కాచినవారు ఈ దారణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని కద్గిల్ నివాసి అయిన తార్సెమ్ సింగ్ కుమారుడు జగ్జీత్ సింగ్. ఇతడు జషన్ కౌర్ అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడితో సన్నిహితంగా వుంటూ వస్తోంది. ఇది కాస్తా యువతి ఇంట్లో తెలిసింది. దీనితో జషన్ కౌర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగ్జీత్ను కలవవద్దని, అతడిని మరిచిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఐతే జగ్జీత్ లేనిదే తను వుండలేనని నిర్ణయించుకున్న జషన్ కౌర్ ఇంటి నుంచి నెల రోజుల క్రితం వెళ్లిపోయి అతడిని ప్రేమ వివాహం చేసుకున్నది.
Trisha Krishnan : తొలి తమిళ హారర్ చిత్రం కోసం లండన్ వెళ్ళిన త్రిష కృష్ణన్
పనోరమా స్టూడియోస్ తొలి తమిళ హారర్ చిత్రాన్ని రూపొందిస్తోంది. దానికోసం త్రిష కృష్ణన్ లండన్ వెళ్ళారు. అక్కడ షూటింగ్ సందర్భంగా పాల్గొన్న పొటోలను వీడియోలను విడుదల చేశారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రంలో త్రిష కృష్ణన్, రాధిక శరత్కుమార్, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
మీరు అతడిని చూడగలరా? కనిపెట్టగలరా?
200 కోట్లకు పైగా డౌన్లోడ్లు దాటిన Clash of Clans, రెండోసారి WWEతో చేతులు కలిపింది; ఈసారి ఈ పోటీ వ్యక్తిగతంగా మారింది. WWE సూపర్స్టార్ కోడీ రోడ్స్, WWE లెజెండ్ జాన్ సీనా రింగ్లో తమ ప్రదర్శనలకు పేరుగాంచారు, కానీ వీరిద్దరి మధ్య పోటీ రింగ్లో మొదలు కాలేదు. ఇద్దరూ చాలా కాలంగా Clash of Clans ఆడుతుండటంతో, వారి ఈ గేమింగ్ నేపథ్యం లాకర్ రూమ్లో ఇప్పటికే ఓ లెజెండ్గా మారింది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























