Bhogapuram Airport: ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్గా భోగాపురం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) అధికారికంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్గా నియమించింది. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం, 2025 అధికారాల కింద జారీ చేయబడిన ఈ నిర్ణయం, అధీకృత చెక్ పోస్ట్ల జాతీయ రిజిస్ట్రీలో భోగపురం విమానాశ్రయాన్ని కేటగిరీ I కింద అధికారికంగా 39వ నంబర్గా చేర్చింది.
ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?
ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జంట నగరాల్లో జూలై 16 నుండి ఆగస్టు 10 వరకు వైభవంగా సాగుతాయి. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఉత్సవాలు ఆగస్టు 2, 3 తేదీలలో సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతాయి. చివరగా, ఆగస్టు 10న లాల్దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయాల నుండి అఫ్జల్గంజ్ సమీపంలోని మూసీ నది వరకు జరిగే ఊరేగింపులతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిగ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి.
మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
భార్య కాపురానికి రావాలని... అత్త చెప్పిందని కన్నతల్లిపై కొడుకు విషయ ప్రయోగం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు ఓ కుమారుడు ఏకంగా కన్నతల్లిపైనే విష ప్రయోగం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే, అత్త చెప్పిందని ఆహారంలో విషం కలిపి తల్లికి తినిపించాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, నిందితుడైన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.
Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్
తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం రసాభాసాగా మారింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి. ఇక ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చేందుకు సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
₹400కే జియో హోమ్ టీవీ ప్యాక్
హైదరాబాద్: డిజిటల్ వినోదాన్ని మరింత అందుబాటులోకి, మరింత సరసమైన ధరలోకి తీసుకురావాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ, జియో జియోహోమ్ టీవీ ప్యాక్ను ఆవిష్కరించింది. నెలకు కేవలం ₹400 నుంచే ప్రారంభమయ్యే ఈ సమగ్ర హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, ప్రీమియం OTT యాప్లు, అలాగే హై-స్పీడ్ వై-ఫై సేవలు ఒకే ప్లాన్లో అందుబాటులో ఉంటాయి.
ఇంటి వినోదాన్ని మరింత సులభతరం చేయడానికి రూపొందించిన జియోహోమ్ టీవీ ప్యాక్ ద్వారా, వినియోగదారులు నెలకు ₹400 (అన్ని పన్నులతో కలిపి) చెల్లించి 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























