'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత
నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ, తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 యేళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి యేడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం "ఏమాయ చేసావె" నుంచి నన్ను మీ నిషిలా భావించారు. నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టిందన్నారు.
కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినా నిర్మాతగా శుభంతో తొలి అడుగు వేశా. నార్త్ అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. మంచి ఫలితాన్ని అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా, మీరు ఎపుడూ నా వెంట ఉన్నారు. అందుకు గర్వపడుతున్నా.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పని చేసినా తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? లేదా? అనే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక గుర్తింపు, కుటుంబాన్ని ఇచ్చారు. ఓబేబీ మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరడం వల్లే మీవల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు. కానీ మీరెప్పటికీ నా మనసులోని ఉంటారు అని అన్నారు.