Funny Humour

Notifications

  1. వినోదం
  2. హాస్యం



బుల్‌ను ఫోటో తీసిన తాతమనవరాలు, వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన దున్నపోతు, వీడియో

బుల్‌ను ఫోటో తీసిన తాతమనవరాలు, వృద్ధుడిని గాల్లోకి విసిరేసిన దున్నపోతు, వీడియోఅమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో దారుణం జరిగింది. పార్కులో నడుచుకుంటూ వెళుతున్న తాతామనవరాలు మగదున్నపోతును చూసారు. దాన్ని ఫోటో తీసారు. వారలా నిలబడి ఏదో చేస్తున్న విషయాన్ని గమనించిన దున్నపోతు ఒక్కసారిగా విదిలించుకుని వారివైపు దూసుకుంటూ వచ్చేసింది. సుమారు 900 కిలోల బరువున్న ఈ దున్నపోతు వాయువేగంతో అత్యంత ఆవేశంతో వారిపై దాడి చేసింది. ఈ దాడిలో మనవరాలు చెట్ల చాటును దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నది. కానీ వృద్ధుడు దానికి దొరికిపోయాడు. అతడిని కొమ్ముతో పొడిచి సుమారు 8 అడుగుల ఎత్తుకు గాల్లోకి విసిరికొట్టింది. కిందపడిన ఆ వృద్ధుడు నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమ్లెట్ గొడవతో ఆత్మహత్య.. అత్త వేధింపులు, కోడలు ఉరేసుకుని బలవన్మరణం

సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బోయ్‌తో పోలిక, బేగం బజార్ పోలీసు స్టేషనుకి నాగార్జున యాదవ్

సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బోయ్‌తో పోలిక, బేగం బజార్ పోలీసు స్టేషనుకి నాగార్జున యాదవ్తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను బేగం బజార్ పోలీసు స్టేషనుకి తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనితో తెలంగాణ పోలీసులు నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో నాగార్జున యాదవ్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసారు. అనంతరం అతడిని తెలంగాణలోని బేగం బజార్ పోలీసు స్టేషనుకి తరలించారు. ఇటీవల ఓ టీవీ డిబేట్లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బోయ్‌తో పోల్చారు. దాంతో టీవీ డిబేట్ వ్యాఖ్యాత... మీరలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనడంతో... సారీ అండి.

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలుకొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.