Shorts

Notifications

భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరధిలోని మారుతీ నగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా దపంతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్.. భార్య నిషారాణిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ రోజు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం మెటా ప్లాట్‌ఫార్మ్స్(Meta)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. RIL 168 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసి, రెండు సంవత్సరాల్లో అందించనుంది. అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుంది.భారతదేశంలో మెటా కోసం ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా (Built-to-Suit) నిర్మించబడుతున్న తొలి డేటా సెంటర్ ఇదే. ఇది AI మౌలిక సదుపాయాల కోసం భారతదేశం ప్రపంచ కేంద్రంగా ఎదుగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ సదుపాయం నుంచి మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనుంది.

మంగళవారం నాడు హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ వర్భ బీభత్సంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆంధ్ర రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ... మీ నగరం మునిగిపోతుంది, సీఎం కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి, ముందు అది చూసుకో పవన్ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి.ఓ నెటిజన్ స్పందిస్తూ.... హైదరాబాద్ డెవల్మెంట్ అయింది బ్రో. జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే. మీ ఆంధ్రవాళ్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లంకి పరిష్కారం దొరకట్లేదు.

హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మహిళా మంత్రిపై తమిళనాట ప్రముఖ యూ ట్యూబర్ మారిదాస్ అసభ్యకరమైన వీడియోను చేసి పోస్ట్ చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనితో అతడిపై చెన్నై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదయ్యింది. సోమరవారం ఉదయం మధురైలోని అతడి నివాసానికి చెన్నై పోలీసులు వెళ్లారు. మధురై నగర పోలీసులను వెంటబెట్టుకుని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసారు.కాగా మారిదాస్ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలోని మహిళా మంత్రితో పాటుగా మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 352(2) కింద కేసు నమోదు చేసారు.

కాచిగూడలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. మే 27 నుండి కాచిగూడలో కనిపించకుండా పోయిన బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి అంకం రాహుల్, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బావి వద్ద శవమై కనిపించాడు.తాను ప్రేమ లేఖ రాసిన ఒక అమ్మాయికి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడంతో రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మే 27న కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వద్ద బయటకు వెళ్తున్నానని తనను ద్విచక్ర వాహనంపై అక్కడికి చేర్చిన స్నేహితుడికి చెప్పిన తర్వాత, 21 ఏళ్ల రాహుల్ ఆచూకీ తెలియకుండా పోయిందని కాచిగూడ పోలీసులు పేర్కొన్నారు. అతని తండ్రి అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వరల్డ్ కప్ 2026 కోసం రూపొందించిన కొత్త పాట ఎట్టకేలకు విడుదలైంది. ఇందులో బాలీవుడ్ తార నోరా ఫతేహి కనిపించారు. సీర్ సీర్ అని పేరున్న ఈ పాటను మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్, ఫ్రెంచ్ గాయకుడు వెజ్‌డ్రీమ్‌తో కలిసి రూపొందించారు. ఇది ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక సంగీత ప్రాజెక్ట్‌లో భాగంగా, టోర్నమెంట్ అధికారిక ఆల్బమ్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంగీత నేపథ్యాలు కలిగిన కళాకారులను ఈ ఆల్బమ్ ఒకచోట చేర్చుతుంది. నోరా ఫతేహి సోమవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పాటను పంచుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 వంటి కార్యక్రమంలో సీర్ సీర్ పాటను భారతదేశం బలమైన ప్రాతినిధ్యంగా నోరా ఫతేహి అభివర్ణించారు.