తన సినీ అరంగేట్రం అంతా ఒక డెస్టినీలా జరిగిపోయింది. కోవిడ్ కు ముందు చిన్న చిన్న వీడిలో చేస్తుండేవాడిని. ఓ వెబ్ సిరీస్ లో నటించా. ఆ తర్వాత ముంబై వెళుతుంటే ఎయిర్ పోర్ట్ లో రాజ్ డీకె కలిసి నన్ను గుర్తు పట్టి.. నీ గురించే నిన్న అనుకున్నాం. నువ్వు చేసిన వెబ్ సిరీస్ బాగుంది. నా తదుపరి సినిమా శుభంలో నువ్వే హీరో అన్నారు. నిన్న అనుకోవడం ఏమిటి? ఈరోజు నేను కలవడం ఏమిటి. అనేది నాకే అర్థంకాలేదు.
ఆంధ్రప్రదేశ్లోని పెదకాకానిలో జూన్ 15, 1975న జన్మించిన శివ, మాస్ అప్పీల్ను భావోద్వేగ లోతుతో మేళవించి 'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్' వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో ఆయన నటించిన తాజా చిత్రం 'దేవర: పార్ట్ 1', సెప్టెంబర్ 27, 2024న విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇరాన్- అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం పెండింగ్లో ఉన్నందున, లెబనాన్లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాల నుండి వైదొలగబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ సోమవారం ప్రకటించారు. ఈ మధ్యంతర ఒప్పందం ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ వైపు నుండి వచ్చిన మొదటి అధికారిక వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరు పక్షాలు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. లెబనాన్తో పాటు సిరియా, గాజా స్ట్రిప్లలో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో అనిశ్చిత కాలం పాటు కొనసాగాలని ఇజ్రాయెల్ యోచిస్తోందని కాట్జ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల సమీపంలో ఉన్న ఓడరేవు బీచ్లో, భారీ అలల ధాటికి సముద్రపు ఉధృతమైన నీటిలో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలుడిని ఆంధ్ర మెరైన్ పోలీసులు ఆదివారం రక్షించారు. బీచ్లో ఈత కొడుతుండగా అఖిలేష్ అనే ఆ బాలుడు సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచేడు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే మెరైన్ పోలీసు బృందాన్ని అప్రమత్తం చేశారు. అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ, మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక ఈతగాళ్లు ఉధృతంగా ఉన్న సముద్రపు నీటిలోకి దూకారు. వారు ఆ బాలుడిని చేరుకుని, లైఫ్బాయ్ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యం లేకుండా, కేవలం జాతీయ సమగ్రత, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించే ఉద్దేశంతోనే ఈ పార్టీని స్థాపించామని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ, పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ ప్రయాణంలో అనేక పోరాటాలు, సవాళ్లను ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల మధ్య కూడా పార్టీ తన ఏడు ప్రధాన సూత్రాలకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.
ఆదివారం రాత్రి ఐసీసి మహిళా ప్రపంచ కప్ టీ20 పోటీల్లో భాగంగా పాకిస్తాన్ మహిళా జట్టును భారతదేశ మహిళా జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా భారత మహిళా జట్టుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిట్లా వుంటే... కొంతమంది ఏఐ టూల్స్ వుపయోగించి ఇరు జట్ల కెప్టెన్లు ఘర్షణ పడినట్లు చూపిస్తున్నారు.పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ నేరుగా ఇండియన్ లేడీ క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వాగ్వాదం జరిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. అందులో హర్మన్ ఆగ్రహంతో సనా షేక్ గొంతుకాయ పట్టుకున్నట్లు చూపించారు. వాస్తవానికి ఇదేమీ జరగలేదు.
భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ కామర్స్ రంగం.. డార్క్ ప్యాటర్న్స్(Dark Patterns) అని పిలిచే మోసపూరిత ఆన్లైన్ డిజైన్ల వల్ల మన దేశం భారీగా ఆర్థిక నష్టాన్ని చవి చూస్తోంది. డేటమ్ ఇంటెలిజెన్స్(Datum Intelligence) ప్రచురించిన 'డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్' (Dark Patterns in India-s Online Marketplaces) నివేదిక ప్రకారం.. ఈ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా భారతీయ వినియోగదారులు ఏటా సుమారు రూ.25 వేల కోట్ల నుండి రూ.28 వేల కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని 304 మిలియన్ల ఆన్లైన్ కొనుగోలుదారులలో దాదాపు 88 శాతం మంది నెలకు సగటున రూ. 78 నుండి రూ. 87 వరకు నష్టపోతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.
తాను పార్టీ స్థాపించినపుడు అధికారం వస్తుందో రాదో కూడా తెలియదని, అపుడు తన మనసులో దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప మరో ఏ ఆలోచనా లేదని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం అనే పేరుతో ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలు ఎదుర్కొన్నామన్నారు.
మనకు తెలిసిన విషయమే. ట్రంప్ పాటికి ట్రంప్ డీల్ కుదిరిందని అంటారు ఆ తర్వాత ఇరాన్ చెప్పిన మాట వినడంలేదని కూడా అంటుంటారు. ఐతే ఈసారి మాత్రం కాస్త పక్కాగా ప్రణాళిక వేసినట్లు చెబుతున్నారు. ట్రంప్ ఒక మెట్టు దిగి ఒప్పందానికి అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ సైతం మెత్తబడినట్లు అనిపించినా కొత్తగా ఓ మెలిక పెట్టింది. తమకు రావాల్సిన సొమ్ము వచ్చాకనే ఒప్పందం పైన సంతకాలు పెడుతామని అంటోందట. ఈ ఒప్పందంలో కీలక అంశాలు ఇవే అంటూ ప్రచారం జరుగుతోంది. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాము.
సాధారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే, ఇటీవల అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటన వచ్చినప్పటికీ, మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గకపోగా భారీగా పెరగడం గమనార్హం.పసిడి ధరలు సరికొత్త ఆల్టైమ్ రికార్డును నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా నిలకడ లేకుండా సాగుతున్న పసిడి ధరలు సోమవారం భారీగా పెరిగాయి.
ఇరాన్ దేశంతో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛగా చమురును నౌకల ద్వారా తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. ట్రూత్ ద్వారా వెల్లడిస్తూ... మీ నౌకల ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అంటూ తెలియజేసారు.ఇంకా ఆయన పేర్కొంటూ... శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు. కాగా ఈ ఒప్పందంలో అంశాలు ఏమిటి అన్నది వెల్లడి కాలేదు. ఇరాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ డీల్ నిజమేనంటూ వెల్లడించారు.
2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారనుంది. ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండటం వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకోనున్నాయి. భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ఎల్నినో, రాబోయే రోజుల్లో వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కడం వల్ల ఎల్నినో సంభవిస్తుంది. ఇది 2026-27 శీతాకాలంలో ఉత్తరార్ధ గోళంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఆదివారం జరిగిన టీ-20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ స్థాయి ఆల్-రౌండర్ దీప్తి శర్మ తన సత్తాను చాటుకుంది. 4 ఓవర్లలో పది పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్-బెస్ట్ గణాంకాలను నమోదు చేసిన దీప్తి, అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.
కృత్రిమ మేథ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండకూడదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేను కలిశారు. కీలక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి, భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరింత సహకారాన్ని కోరారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు, సాంకేతికత, తయారీ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, అలాగే భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలు, పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో చర్చలు జరపనున్నారు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె కాపురాన్ని కూల్చి, శారీరకంగా లొంగదీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ అరాచకానికి ఒడిగట్టిన హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 12,437 మంది విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, కొత్త యూనిఫాంలు, విద్యార్థి కిట్ల పంపిణీతో రాష్ట్రం 2026-27 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తోంది. అలాగే పాఠశాల మార్గాల్లో అదనపు టీజీఎస్సార్టీసీ బస్సు సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్జైన్ తెలిపారు.
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఓ పాప్ సింగర్తో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందీరాంటెస్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రజలు రమ్మంటున్నారు.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అన్నారు. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను "సానుకూల నిర్ణయం" తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి ప్రకటన వెల్లడిస్తానని తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్కు భయపడి దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కాదని ప్రముఖ సినీ గేయరచయిత అనంత్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకుడు. ఏఆర్. రెహ్మాన్ దర్శకుడు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ను చూపించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పారు. దీనిపై సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ తప్పుబట్టారు.
ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు లేదా అక్రమాలకు పాల్పడితే ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డిస్మిస్ చేయడం అనేది ఒక ఉద్యోగి జీవితాన్ని రోడ్డున పడేసే అత్యంత కఠినమైన శిక్ష అని పేర్కొంది. తప్పు తీవ్రతతో పాటు సదరు ఉద్యోగి సుధీర్ఘ సర్వీసు, వయసు, సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లిందనే అంశాలను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ సినీ నటి అత్యాచారానికి గురైంది. ఆ నటికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిన క్యాస్టింగ్ డైరెక్టర్.. ఆ నటిని కారులో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్కు చెల్లి పాత్రను పోషించిన నటి కావడం గమనార్హం.
ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలంతో లక్ష్యఛేదనలో పాక్ 106 పరుగులకు కుప్పకూలింది.
Smriti Mandhana ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎడ్జెబ్స్టన్లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ మహిళల జట్టు 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళా బ్యాట్సమన్లు దూకుడుగా ఆడారు. స్మృతి మంధన కేవలం 44 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టి 68 పరుగుల భారీ పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు ముందు భారీ లక్ష్యం వుంచగలిగినట్లయ్యింది. షెఫాలీ వర్మ 6 పరుగులకే ఔటయ్యింది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకార్యం సిద్ధిస్తుంది. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల సలహా పాటిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడనం విస్తరించిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
విద్యార్థులకు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ హితవు పలికారు. గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు అని పిలుపునిచ్చారు. అలాగే, ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులు చదువులో రాణిస్తారని రష్మిక మందన్నా భర్త, సినీ హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
రాజ్యసభలో ఎన్డీయే బలం పెరుగుతోంది. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలోకి రానుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే ఎగువ, దిగువ సభల్లో బలం పుంజుకుంటోంది. ముఖ్యంగా రాజ్యసభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీకి చేరువవుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లుల సమయంలో ఈ మెజారిటీ ఎన్డీయేకు ఉపయోగపడుతుంది. అదేసమయంలో లోక్సభలో మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీకి ఇంకాస్త దూరంలో నిలవనుంది.
ప్రజలు కుక్కలుతో సమానం అని కోలీవుడ్ నటుడు రాఘవ లారెన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై ఆయన తన ఎక్స్ పేజీలో వివరణ ఇచ్చారు. లారెన్స్ పేర్కొంటూ... నా ఇటీవలి పత్రికా సమావేశానికి సంబంధించి నెలకొన్న ఒక అపార్థాన్ని నేను నివృత్తి చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నా తల్లితో సమానమని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. నేను ప్రజలను కుక్కలని సంబోధించానని కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, ఇది పూర్తిగా అవాస్తవం, తప్పుదోవ పట్టించేది.
ఓ జంట విడాకుల కోసం ఐదేళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఆర్థికంగా నష్టపోయారు. కానీ, ఓ చిన్న సంఘటనతో కేవలం ఐదు నిమిషాల్లో కోర్టు హాలులో న్యాయమూర్తి సమక్షంలో ఒకరినొకరు హత్తుకుని కన్నీరు పెట్టుకుని కలిసిపోయారు. దీంతో ఐదేళ్ళ విడాకుల కేసు కేవలం ఐదు నిమిషాల్లో తేలిపోయింది. దీంతో న్యాయమూర్తితో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్ఫార్మ్స్(JPL), ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) ఇటీవల విడుదల చేసిన తాజా పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్లో ప్రపంచ టాప్-20లోకి ప్రవేశించింది. ప్రచురిత డేటా ఆధారంగా అగ్ర PCT దరఖాస్తుదారులను ఈ నివేదిక ర్యాంక్ చేస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాలో JPL ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో హువావే, శాంసంగ్, క్వాల్కమ్, ఎల్జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సరసన స్థానం సంపాదించింది.
ఇన్నోవేషన్స్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన నీస్ నగరంలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. సుస్థిర భవిష్యత్, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తుందన్నారు. తమ దేశానికి చెందిన యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చేలా పరిష్కార మార్గాలు చూపుతున్నారని అన్నారు.
షిర్డీ సాయిబాబు భక్తులకు నాలుగు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు. అవేమిటంటే...1. కోరికలన్నీ విడిచి దైవం మీద మనసు నిలపడం.2. పని చేస్తూనే భగవన్నామ స్మరణ చేయడం.3. ఎవరి సేవనూ ఉచితంగా తీసుకోకపోవడం.4. ఏ పని చేసినా దానిని సంపూర్ణంగా, కారుణ్యంతో చేయడం.మామిడి చెట్టుకు పూత చాలా వస్తుంది కానీ, గాలికి రాలిపోగా కొన్ని మాత్రమే కాయలుగా మారుతాయి. అలాగే బాబా వద్దకు వచ్చే భక్తులలో తీవ్రమైన సాధన, వివేక వైరాగ్యాలు ఉన్నవారు మాత్రమే ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందుతారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆమెకే లీగల్ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఒకవైపు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకే రెబల్ ఎంపీ కుమారుడు లీగల్ నోటీసులు పంపగా, మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు లోక్సభ సభ్యులపై అధిష్టానం వేటు వేసింది. అదేసమయంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక అడుగు వేయనుంది. జాబిల్లిపై దిగే ల్యాండర్ల పనితీరు కాలాన్ని ప్రస్తుతం 14 రోజుల నుంచి 100 లేదా 200 రోజులకు పెంచేలా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. శనివారం బెంగుళూరులో జరిగన ఓ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని, ఆదివారమే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే, ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తిరిగి తెరుస్తామని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు.
గతంలో తాను ఇథనాల్ భవిష్యత్ ఇంధనం అని చెప్పినపుడు ప్రతి ఒక్కరూ ఫక్కున నవ్వుతూ కామెంట్స్ చేశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాజాగా దేశంలో 100 శాతం ఇథనాల్ వినియోగాన్ని చట్టబద్ధం చేస్తూ జారీ చేసిన ఫైలుపై శనివారం రాత్రి 8 గంటలకు సంతకం చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి తాను ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు.
కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజీ జంప్ కోసం యత్నించిన ఓ యువతికి సేఫ్టీ తాడు కట్టడం మరిచిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 13వ తేదీన బ్రెజిల్ సావోపాలోలో బంజీ జంప్ చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది సేఫ్టీ ఎక్విప్మెంట్ అమర్చడం మరిచిపోయారు. అదేసమయంలో ఆ యువతిని ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి నెట్టేశారు. ఫలితంగా ఆ యువతి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇరానీ కేఫ్లు కేవలం స్ట్రీట్ కార్నర్స్ వీధుల కూడళ్ళలోనే కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో అర్థం కాదు. ముఖ్యంగా, దక్షిణ ముంబై వీధుల్లో నడుస్తుంటే ఇరానీ చాయ్. తాజా మావా కేక్స్, బ్రన్-మస్కాల సువాసనలు మనల్ని పలకరిస్తాయి.
వేధింపులకు గురైన వారు ఆడబిడ్డలు రాజకీయ ప్రత్యర్థుల కుమార్తెలు అయినప్పటికీ మన బిడ్డలేనని, అలాంటి ఆడబిడ్డలపై ట్రోల్ చేసిన వాళ్లను పట్టుకుని బొక్కలే వేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో వెళ్లారు. అయితే, ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చుని గావెల్తో (చెక్క సుత్తి) కొడుతూ 'ఆర్డర్ ఆర్డర్.. విచారణలు ప్రారంభించండి?' అని సూచనలు జారీ చేశారు.
దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు జారీలో ఒకే రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కానీ, అస్సాం రాష్ట్రంలో కొత్త నిబంధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. తమ రాష్ట్రంలోని అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు వీలుగా 18 యేళ్లు నిండిన తర్వాత కొత్త ఆధార్ కార్డులను జారీని నిలిపివేసింది. కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సందేహం వచ్చింది. దీంతో 18 యేళ్లు నిండిన వారికి ఆధార్ కార్డును జారీ చేయొద్దని అధికారులను ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తాతతో కలిసి బైకుపై వెళుతున్న ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఓ కామాంధుడు ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించిన యూపీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయవాడలో కేశినేని బ్రదర్స్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టీడీపీలో ఉన్నపుడు విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఆ పిమ్మట ఆయన వైకాపా పంచన చేరడంతో ఆ స్థానంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి టీడీపీ టిక్కెట్ కేటాయించడంతో అన్నపై గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, ఈ అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
చైనాలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫుటేజీలో, హెలికాప్టర్ ఒక పచ్చని మైదానంలో కూలిపోయి రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయినప్పటికీ దాని రోటర్ బ్లేడ్లు చాలాసేపటి వరకు వేగంగా తిరుగుతూనే ఉన్నాయి.కాక్పిట్లో చిక్కుకున్న పైలట్, అతని సహచరుడు తీవ్రంగా అటూ ఇటూ విసిరివేయబడుతూ కనిపించారు. ఒక పైలట్ హెలికాప్టర్ డోర్ నుండి సగం బయటకు వేలాడుతూ, పదేపదే నేలను విమానం అంచును ఢీకొంటూ కనిపించాడు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంసర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆశావహ దృక్పథంతో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాల జాగ్రత్త. యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.