కొన్ని ఘటనలు మనం అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటివల్ల మనకు ప్రతికూల ఫలితాలు వచ్చిపడతాయి. అట్లాంటిదే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వామిక అనే భారతీయ యువతికి జరిగింది. తను 5 నిమిషాల పాటు వేడి నీటితో స్నానం చేస్తున్నప్పుడు తన ఫైర్ అలారం మోగిందనీ, దీనివల్ల ఆమె 1,900 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు ₹1.3 లక్షలు) జరిమానా చెల్లించాల్సి వచ్చిందట.ఫైర్ అలారం మోగినప్పుడు, భవనంలోని వారందరినీ బయటకు పంపించాల్సి వచ్చింది. వామిక తెలిపిన వివరాల ప్రకారం, బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి వచ్చిన ఆవిరి కాస్త ఫైర్ అలారం వరకు చేరడం వల్లే అది కుయ్ మంటూ అరిచింది.
హైదరాబాద్: భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ హైదరాబాద్లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు. ఆగస్టు 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఈ రెండు రోజుల ప్రదర్శన జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు.న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి?తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు.జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
దేశంలోనే రెండవ అతిపెద్ద పెయింట్ కంపెనీ అయిన బెర్గర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ తన బ్రాండ్ గుర్తింపును సరికొత్తగా ఆవిష్కరించింది. జీవితం మనల్ని ఎంతగా పరీక్షించినా, అది మనలోని ఉత్సాహాన్ని ఎన్నటికీ దూరం చేయకూడదు అనే బలమైన నమ్మకంతో ఈ ప్రచారాన్ని రూపొందించింది. రంగ్ బనా రహే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త కార్యక్రమం, రంగులను పదిలంగా ఉంచుతామన్న బెర్గర్ పెయింట్స్ వాగ్దానాన్ని మానవ కోణంలో కొత్తగా వివరిస్తుంది. సాధారణంగా పెయింట్స్ బ్రాండ్లన్నీ రంగును కేవలం గోడలకు వేసే అందంగానే చూపిస్తాయి. కానీ బెర్గర్ మాత్రం దానికి భిన్నంగా, ఒక సరికొత్త దృక్పథంతో ఈ ప్రచారాన్ని అందంగా తీర్చిదిద్దింది.
ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల సమయంలో తన పోలీసు సోదరుడు విధుల్లో వుండగా సీజెపి నిరసనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారనీ, ఐతే గాయపడ్డ పోలీసుల క్షేమసమాచారాలను కూడా సీజెపి బృందం వాకబు చేయలేదని ఓ ఢిల్లీ పోలీసు సోదరి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అన్నయ్య సీజేపీ నిరసనల సమయంలో అక్కడే ఉండి, సీజేపీ నిరసనకారుల వల్ల తీవ్రంగా గాయపడ్డారు.అభిజీత్ దీప్కే ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేదు. అశుతోష్ రాంకా ఒక్కసారి కూడా వారిలో ఎవరినీ పరామర్శించలేదు. వాళ్లు మా అన్నయ్యను గూండా, గూండా అని కూడా అన్నారు.
ఆధునిక కంప్యూటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి బలమైన కంప్యూటర్ సైన్స్ పునాది అవసరాన్ని గుర్తించి, IIT బాంబే ఎడ్యుకేషనల్ ఔట్రీచ్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(CS & AI)లో ఇ-పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది. ఈ కార్యక్రమం యొక్క కంప్యూటర్ సైన్స్ పునాదిపై ఆధారపడి, విస్తరించిన సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్పై గణనీయంగా ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు.IIT బాంబే ఫ్యాకల్టీ రూపొందించి బోధించే ఈ కార్యక్రమం, ఎడ్టెక్ భాగస్వామిగా గ్రేట్ లెర్నింగ్తో కలిసి, బలమైన కంప్యూటర్ సైన్స్ పునాదులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లోని సమకాలీన పరిణామాలతో మిళితం చేస్తుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యోగాసనాలతో ఓ వ్యక్తి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ వీడియో తెలుగుదేశం ఫోటోతో ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించండంటూ పోస్టు చేసిన వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. అతని ప్రతిభను గుర్తించాలని.. ఇది ఎంతో ఆవశ్యకమని.. పాటల ద్వారా రాజకీయ పార్టీలను ప్రచారం చేయడం కాదు. మన భారతదేశపు ఘనతను, సంస్కృతిని ప్రతిబింబించే వ్యక్తులు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారని ఈ వీడియో ద్వారా ఎత్తి చూపారు.
మాస్ మహరాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమాకు కుటుంబ సభ్యుల ఆదరణ పొందుతోంది. చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంగా సాగిన ఈ చిత్ర కథకు మూలం రోజువారీ వార్త ప్రతికలలో చూసిన వార్తలే ప్రేరణగా దర్శకుడు శివ నిర్వాణ తెలియజేశారు. అయితే ఈ సినిమాకు మరో ట్విస్ట్ కూడా వుంది. రవితేజ కుమార్తె మోక్షద కూడా ప్రొడక్షన్ పనుల్లో చురుగ్గా పాలుకొంది. కనుక తను చాలా కేర్ తీసుకుందని రవితేజ ఇటీవలే వెల్లడించారు.
#మీటూఫర్మెన్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘బందర్’.. ఓ మహిళ చేసిన ఆరోపణతో ఒక్కసారిగా తలకిందులైన ఓ వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజం బయటకు రాకముందే ప్రజల అభిప్రాయాలు, మీడియా పరిశీలన, సామాజిక తీర్పులు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాలను ఈ చిత్రం ఆవిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించే నాయకులలో కొడాలి నాని ఒకరనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కళ్యాణ్ వంటి వారిపై ఆయన వాడే భాష అంగీకరించలేని స్థాయికి ఉండేది. అయితే, 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని వ్యవహారశైలిలో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. ఆయన ఇప్పుడు మారిన వ్యక్తిలా కనిపిస్తున్నారు.
బెంగుళూరు: పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని, తోబుట్టువుల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని జరుపుకోవడానికి మరియు ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి అమెజాన్ రాఖీలు, ఆలోచనాత్మక బహుమతులు, పండుగకు అవసరమైన వస్తువులను ఒకచోట చేర్చింది. రాఖీలు మరియు వ్యక్తిగతీకరించిన హ్యాంపర్ల నుండి రుచికరమైన తీపి పదార్థాలు, చాక్లెట్లు, సరికొత్త టెక్ గాడ్జెట్ల వరకు, రక్షా బంధన్ స్టోర్ ప్రతి తోబుట్టువు కోసం విస్తృత శ్రేణి బహుమతి ఎంపికలను ఒకచోట చేర్చింది.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు గారు హైదరాబాద్లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు.
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.
2019లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎంపీ వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్. భాస్కర్ రెడ్డితో సహా ఈ కేసులో కీలక అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలలో 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ సోదాలు జరిగాయి.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ విశ్వంభర నుంచి ప్రత్యేక పోస్టర్ మరియు OST విడుదల చేస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ చిత్రంతో ప్రేక్షకులు త్వరలోనే 'మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్' (అద్భుతమైన మెగా మాస్ అనుభూతి)ని చూడబోతున్నారని పేర్కొంది.
ఏపీ సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతుంటే, కొందరు (వైఎస్ఆర్సీపీ) మాత్రం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే, నీటి వనరులు అడుగంటిపోతాయని, తాగునీరు దొరకదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద పెద్ద డేటా సెంటర్లు రావడం వల్ల లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఎంతగా కనెక్ట్ అయి వుంటున్నారంటే చివరికి హత్యలు చేసి కూడా అందులో పెట్టేస్తున్నారు. ఇట్లాంటి దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో ఉద్యోగిగా వున్న మానస్ అనే వ్యక్తి తన భార్య తనను మోసం చేసిందని తుపాకీతో కాల్చి చంపేసాడు. భార్యను హతమార్చే ముందు తన వాట్సర్ స్టేటస్లో... నా భార్య నన్ను దారుణగా మోసం చేసింది. అందుకే ఆమెను చంపేసాను. ఇప్పుడు నా సోదరిని చంపాలి. ఆ తర్వాత నేను కూడా చనిపోవాలి.
రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 నుంచి అలాబోలెలో.. పాట ప్రోమో విడుదలైంది. ఈ పాటలో బలమైన మలయాళీ శైలి కనిపిస్తుంది మరియు ఇందులో ఒక మలయాళ నటుడు రాజేష్ మాధవన్ కూడా నటించారు. ఈ పాటలో పూర్ణ డాన్స్ చేసింది. అయితే శనివారంనాడు ఈ ప్రోమోపై మలయాళీలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు స్పందిస్తున్నారు. కాగా, 5 మిలియన్ కు పైగా వీక్షకులను అలరించింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో ఆమె హగ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇరాన్ - హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలపై చర్చించేందుకు పారిస్లో నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భాగంగా.. అధికారికంగా మెలోనీకి స్వాగతం పలుకుతున్న సమయంలో మాక్రాన్ అకస్మాత్తుగా ఆమెను ఆలింగనం చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపిస్తున్న సమయంలో, పైలట్ హెలికాప్టర్ను చాలా తక్కువ ఎత్తుకు తీసుకురావడంతో, బలమైన గాలుల కారణంగా రోడ్డుపై ఉన్న ప్రజలు కిందపడిపోయారు.ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన కన్వర్ యాత్ర సందర్భంగా, గగనతలం నుండి హెలికాప్టర్ నుంచి పూలు కురిపిస్తున్న కార్యక్రమం కారణంగా గందరగోళం నెలకొంది. భక్తులపై పూలు కురిపిస్తున్న హెలికాప్టర్, రోడ్డుకు ప్రమాదకరంగా దగ్గరగా దిగింది. అది ఎంత తక్కువ ఎత్తులో ఎగురుతోందంటే, దాని రోటర్ బ్లేడ్ల నుండి వెలువడిన బలమైన గాలి పీడనం నేలపై తుఫాను లాంటి పరిస్థితులను సృష్టించింది.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర వివరాలను తెలియజేశారు.
పోలవరంలో ఘోరం జరిగింది. ఇనుము లోడుతో ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి చింతూరు మండలం సమీపంలో ఈ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒడిశా నుండి చెన్నైకి వెళ్తున్న ఇనుము లోడుతో ఉన్న లారీని ఒక కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. సమాచారం ప్రకారం, ఢీకొట్టిన ధాటికి లారీ ఆ కారును దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది.
మా చిన్నతనంలో, అన్నయ్య తన కాలేజీ చదువు కోసం నర్సాపూర్కు వెళ్ళేవారు. వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం ఒక పండుగలా ఉండేది. మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధగా, నిరాశగా అనిపించేది. ఆయన లేని లోటు మా అందరికీ స్పష్టంగా తెలిసేది; ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇల్లు అంత ఉత్సాహంగా ఉండేది కాదు.
రమేష్ వర్మ దర్శకత్వంలో పెనుమేష్ట ధనుంజయ్ వర్మ కర్ణుడిగా నటిస్తున్న చిత్రం మహావీర్ కర్ణ టీజర్ నేడు విడుదలైంది. లైవ్-యాక్షన్ను అధునాతన విజువల్ ఎఫెక్ట్స్తో మేళవించి రూపొందించిన ఈ చిత్రాన్ని భారతీయ సినిమా యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ ఇతిహాసంగా అభివర్ణిస్తున్నారు.
తన వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వాట్సాప్ సరికొత్త మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇకపై కేవలం సందేశాలు, కాల్స్కే పరిమితం కాకుండా కంటెంట్ క్రియేషన్, అసిస్టెన్స్, ఫోటో ఎడిటింగ్ వంటి సేవలను వాట్సాప్ ద్వారానే ఉచితంగా పొందవచ్చు. యూజర్లు తమకు నచ్చిన చిత్రాన్ని టెక్స్ట్ రూపంలో టైప్ చేయడం ద్వారా క్షణాల్లో కొత్త ఇమేజ్లను, ప్రొఫైల్ పిక్చర్లను అలాగే మన మూడ్కు తగిన ప్రత్యేక స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు.
చీర కట్టుకుని, తాను హిజ్రా అని నమ్మిస్తూ ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ప్రతిష్టాత్మక పోవై ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 19న అనిల్ శేషారావు షిండే (28) అనే వ్యక్తి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారికి దిష్టి తీస్తానని లేదా సంతానం లేనివారికి పూజలు చేస్తానని నమ్మబలికి ఎలాంటి అనుమానం రాకుండా ఫ్లాట్లోకి ప్రవేశించాడు.ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే నిందితుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆపై ఆమెను పూజ చేస్తున్నట్లు బెదిరించి.. బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గుజరాత్కు చెందిన 21 ఏళ్ల భారతీయ పౌరుడు సునీల్భారతి గోస్వామిని, వైర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ ఆరోపణలపై అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో నివసిస్తున్న గోస్వామి, విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుండగా కెనడాలో అరెస్టయ్యాడు. వృద్ధ బాధితుల నుండి డబ్బు, బంగారాన్ని సేకరించడంలో సహాయపడే 'మనీ మ్యూల్'గా గోస్వామి పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి.
దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో విడతన పునరావాస ప్యాకేజీ కింద మరో రూ.250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. అలాగే, ఈ ప్రాజెక్టు తొలి దశ పనులను ఈ నెల 31వ తేదీన ప్రారంభించనున్నట్టు ఆయన ఈ సందర్భంగా చారిత్రాత్మక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు 30 యేళ్ల కల సాకారం కానుంది.
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి ఇతరులను తొక్కుతారనే విమర్శలకు ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. చిరంజీవి ఎవరినీ తొక్కరని, పైకి ఎక్కించి ప్రోత్సహించి ఉన్నతస్థానంలో కూర్చోబెడతారని చెప్పారు. కష్టపడే ప్రతి ఒక్కరూ పరిశ్రమలో పైకి రాగలరనే భరోసా ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవేనని చెప్పారు. అందుకే ఆయన జీవిత చరిత్రను రాబోయే తరాలకు ఒక పాఠ్యపుస్తకంగా పెట్టాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించడంతో పాటు పెను వివాదానికి దారితీశాయి. దీంతో మంత్రి కొండా సురేఖకు టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ మేరకు అధికారిక ప్రక్రియ ప్రారంభంకానుంది.
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీన శనివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు పసందైన బహుమతి ఇచ్చారు. తన 158వ చిత్రం టైటిల్తో పాటు టీజర్ను అధికారికంగా వెల్లడించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాకా అనే టైటిల్ను ఖరారు చేసి, ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి ఓ మధ్యతరగతి వ్యక్తి పాత్రను పోషించారు. అక్వా సంస్థలో ఉద్యోగిగా చిరంజీవి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడలోని మారివలస-తిమ్మాపురం రోడ్డుపై రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మొత్తం 20 మంది యువకులలో 17 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై ఆరు కేసులు నమోదు చేశారు.సమాచారం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న ఈ యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.
శుక్రవారం కేరళలో భారీ వర్షాలు కురిశాయి. ఉదయపు వేళల్లో ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పలు జిల్లాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ఉదయం 7 గంటలకు ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ మరియు కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలోని బేగంపేట్లో ఓ స్టార్ హోటల్ యజమానిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమ హోటల్లో పని చేసే 35 యేళ్ల మహిళను హోటల్ ఎండీ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బొబ్బిలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో పరిచయమైన ఒక యువతి చాటింగ్ చేయడం మానేయడంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఢిల్లీ శివారులో ఓ దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో అత్తింటివారు దూరారు. వారి మధ్య మాటామాటా పెరగడంతో అత్తంటివారు కలిసి అల్లుడిపై దాడి చేసి చంపేశారు. మృతుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. పేరు వినయ్ గుప్తా (31).
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల కుడి భుజానికి ఆయన ఆపరేషన్ జరిగింది. ఈ చేతికి ఆయుర్వేద థెరఫీ చేసుకునేందుకు కేరళకు వెళుతున్నారు.
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు అధికం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల కలయికకు వీలుపడదు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలువ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
తెలంగాణ వాతావరణ సూచన... రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు జల్లులు లేదా అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలు: పాక్షికంగా నుండి సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం తేలికపాటి జల్లులు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 23°C నుండి గరిష్టంగా 29°C–30°C మధ్య ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వైఎస్ జగన్ నిజమైన మాస్ లీడర్ అని చెప్పాలి. ప్రజలతో ఆయనకు ఉన్నంత బలమైన అనుబంధం చాలా తక్కువ మంది నాయకులకు మాత్రమే ఉంటుంది. అయితే, సమస్య ఏమిటంటే జగన్ ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారీ తనకున్న ఆ ప్రజాదరణను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు కురవకపోవడం వల్ల సీతాఫలాల సాగు దెబ్బతింది, దీనివల్ల ఈ సీజన్లో స్థానిక మార్కెట్లలో ఇవి పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితి వ్యాపారులు, వినియోగదారులను నిరాశకు గురిచేసింది. మహారాష్ట్రలో దిగుబడి తగ్గడం ఈ కొరతకు ప్రధాన కారణమని టోకు వ్యాపారులు పే
అనేక షరతుల నెరవేర్పుకు లోబడి, నాగార్జున సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రం నుండి జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టాలంటే, ముందుగా ఆనకట్టలోని నీటి మట్టం ప్రస్తుతమున్న 532 అడుగుల నుండి 535 అడుగులకు పెరగాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 171.48 టీఎంసీల (54.95 శాతం) నీరు నిల్వ ఉండగా, సుమారు 55,278 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది; దీని పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద సామర్థ్యం 312.05 టీఎంసీలుగా ఉంది.
ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో మూఢనమ్మకాల కారణంగా ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. దూరమైన తన భార్యను తిరిగి పొందేందుకు చేసిన నరబలి ఆచారంలో భాగంగా, ఒక వ్యక్తి మానసిక వికలాంగుడైన యువకుడి తల నరికి చంపాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. తుషురా పోలీస్ పరిధిలోని టెబాడాముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖర్సెల్ అనే బాధితుడిని, నిందితుడైన శత్రుఘ్న సాహు తన ఇంటికి తీసుకువచ్చి ఉంచాడు. అనంతరం ఆగస్టు 18 రాత్రి నిద్రిస్తున్న ఆ యువకుడిని హత్య చేశాడు.
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము.పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు.అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు.వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు.టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు.కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి.రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.
విజయనగరం జిల్లాలో టెట్ పరీక్ష ఫలితాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన 24 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరివిడిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రసన్న కుమార్తో తనుజకు జూలై 2న వివాహం జరిగింది. ఆషాఢ మాసం కారణంగా ఆమె జూలై 15న పుట్టింటికి వెళ్ళి, ఆగస్టు 19న తిరిగి అత్తవారింటికి చేరుకుంది. గురువారం నాడు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనుజ ఇంటి మొదటి అంతస్థులోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అత్తమామలు బ్యాంకు పని నిమిత్తం పెదమానపురం వెళ్లారు.
ఒక ఫోన్ కోసం ప్రాణం తీసుకున్నాడు ఓ యువకుడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్ర శంభాజీనగరులో మురళీధర్, సంగీతలకు ఒకే ఒక్క కుమారుడు 19 ఏళ్ల కునాల్. మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు కునాల్. ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి నేరుగా ఖావడాహిల్ చేరుకున్నాడు. కొండ పైభాగానికి వెళ్లి కొండ చివర అంచున నిలబడి దూకేందుకు సిద్ధమయ్యాడు.ఇంతలో అతడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవద్దని నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో అన్నప్రసాదం, లడ్డూ పోటు భవనాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రూ.52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సముదాయంలో ఒకేసారి 800 మంది భోజనం చేసేందుకు వీలుగా భోజనశాల, 10,000 మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేసి వడ్డించగల సామర్థ్యం ఉన్న ఆధునిక వంటశాల ఉన్నాయి.
సరైన పేపర్స్ లేకుండా బండిని నడుపుతున్న తండ్రిని ఓ బుడతడు పోలీసులకు పట్టిచ్చాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో, సరైన పత్రాలు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల పోలీసులు చేపట్టిన తనిఖీల సమయంలో దాచిపెట్టిన తన తండ్రి బైక్ను కనుగొనడంలో ఒక ఆరేళ్ల బాలుడు పోలీసులకు సహాయపడ్డాడు. గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నప్పుడు, ఆ బాలుడి తండ్రి సురేష్ తన బైక్ను వేరొక వీధిలో దాచిపెట్టాడు. ఆ బాలుడు వ్యవహరించిన తీరు పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఆత్మహత్యగా భావిస్తున్న ఘటనలో మరణించిన పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జి.నూకరాజు భార్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, వారి కుమార్తె కె.సౌజన్య (38) మృతదేహం మాత్రం కొత్తపేట సమీపంలోని గోదావరి నదిలో లభ్యమైందని శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ ఎ.శివప్రియ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం నాడు కొమ్మరవారిపల్లి గ్రామం వైపుగా నది మధ్యలో పాక్షికంగా కుళ్ళిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం నూకరాజు తన భార్య మీనా, కుమార్తె, 10 ఏళ్ల మనవడు కార్తికేయ రెడ్డి, డ్రైవర్తో కలిసి కొవ్వూరు నుండి రాజమండ్రి వైపు ప్రయాణించారు.
భారతదేశపు మొట్టమొదటి బ్రాండెడ్ రైలు అయిన 'స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్' ప్రారంభం నేపథ్యంలో, కోకా-కోలా ఇండియా మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)లు ప్రయాణికులకు 'వేస్ట్-టు-వాల్యూ' (వ్యర్థాల నుంచి విలువను సృష్టించే) ఆచరణాత్మక పరిష్కారాలను చేరువ చేస్తున్నాయి. మొట్టమొదటిసారిగా కుదిరిన స్ప్రైట్ మరియు ఐఆర్సీటీసీ భాగస్వామ్యాన్ని ఈ చొరవ మరింత విస్తరిస్తోంది. వినియోగం తర్వాత పడేసే వ్యర్థాలను ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ఉపయోగకరమైన వస్తువులుగా ఎలా మార్చవచ్చో ఇది నిరూపిస్తోంది.