Shorts

Notifications

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంశుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సోమవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

భారత క్రికెట్ జట్టుకు తేరుకోలేని దెబ్బతగిలింది. ఐర్లాంట్, ఇంగ్లండ్ జట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు అజేయంగా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ కిందికి పడిపోయింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత్ గెలిచి ఉంటే టాప్ ర్యాంక్‌ను కాపాడుకొనే అవకాశం ఉండేది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలో సుదీర్ఘంగా ఉన్న అగ్రస్థానం ఘనత చేజారింది.

కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతంలో జరిగిన ఘోర వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు రాజ్‌కుమార్ (28) బాలికను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దైహాలగూడలో రాత్రి 11 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ నరమేథానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మన తొలుత హత్య చేసిన నిందితుడు.. ఆ తర్వాత బాలికను బలవంతంగూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేసి వరుస హత్య గురించి చెప్పాడు.

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణీ, ప్రఖ్యాత ఫార్చ్యూన్ ఇండియా వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితాలో స్థానం సంపాదించి, ఒక అరుదైన, ప్రతిష్టాత్మకమైన గుర్తింపును పొందారు. కార్పొరేట్ రంగంలో ఆమె ప్రభావవంతమైన నాయకత్వాన్ని, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఆమె పోషించిన పాత్రను ఈ పురస్కారం హైలైట్ చేస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన అధికారిక ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో, దేశ ఆర్థిక స్వరూపాన్ని తీర్చిదిద్దుతున్న మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ నాయకుల ఉన్నత వర్గంలో చేరి, నారా బ్రాహ్మణీ లాంఛనంగా ఈ అవార్డును అందుకున్నారు.