Shorts

Notifications

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సమీపంలో ఉన్న ఓడరేవు బీచ్‌లో, భారీ అలల ధాటికి సముద్రపు ఉధృతమైన నీటిలో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలుడిని ఆంధ్ర మెరైన్ పోలీసులు ఆదివారం రక్షించారు. బీచ్‌లో ఈత కొడుతుండగా అఖిలేష్ అనే ఆ బాలుడు సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచేడు సబ్-ఇన్‌స్పెక్టర్ వెంటనే మెరైన్ పోలీసు బృందాన్ని అప్రమత్తం చేశారు. అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ, మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక ఈతగాళ్లు ఉధృతంగా ఉన్న సముద్రపు నీటిలోకి దూకారు. వారు ఆ బాలుడిని చేరుకుని, లైఫ్‌బాయ్ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.

భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ కామర్స్ రంగం.. డార్క్ ప్యాటర్న్స్(Dark Patterns) అని పిలిచే మోసపూరిత ఆన్‌లైన్ డిజైన్ల వల్ల మన దేశం భారీగా ఆర్థిక నష్టాన్ని చవి చూస్తోంది. డేటమ్ ఇంటెలిజెన్స్(Datum Intelligence) ప్రచురించిన 'డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్' (Dark Patterns in India-s Online Marketplaces) నివేదిక ప్రకారం.. ఈ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా భారతీయ వినియోగదారులు ఏటా సుమారు రూ.25 వేల కోట్ల నుండి రూ.28 వేల కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని 304 మిలియన్ల ఆన్‌లైన్ కొనుగోలుదారులలో దాదాపు 88 శాతం మంది నెలకు సగటున రూ. 78 నుండి రూ. 87 వరకు నష్టపోతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.

ఇరాన్ దేశంతో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛగా చమురును నౌకల ద్వారా తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. ట్రూత్ ద్వారా వెల్లడిస్తూ... మీ నౌకల ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అంటూ తెలియజేసారు.ఇంకా ఆయన పేర్కొంటూ... శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు. కాగా ఈ ఒప్పందంలో అంశాలు ఏమిటి అన్నది వెల్లడి కాలేదు. ఇరాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ డీల్ నిజమేనంటూ వెల్లడించారు.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫార్మ్స్(JPL), ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) ఇటీవల విడుదల చేసిన తాజా పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20లోకి ప్రవేశించింది. ప్రచురిత డేటా ఆధారంగా అగ్ర PCT దరఖాస్తుదారులను ఈ నివేదిక ర్యాంక్ చేస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాలో JPL ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో హువావే, శాంసంగ్, క్వాల్కమ్, ఎల్‌జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సరసన స్థానం సంపాదించింది.

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.