హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రంగా తెరకెక్కింది. గత నెల 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. దీంతో చిత్రం బృందం అధికారికంగా రూ.100 కోట్ల కలెక్షన్ పోస్టర్ను ఆదివారం రిలీజ్ చేసింది. మరోవైపు, ఈ చిత్రం ఈ నెల 19వ తేదీ నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి నాయిక ప్రాధాన్యం కలిగిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు బృందాల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు అతడు ఉపయోగించిన సిమ్ కార్డులతో పాటు బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లో వివాదం చెలరేగింది. దీంతో అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతపై పలువురు డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షురాలి హోదాలో సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. పైగా, సుమలత తీరును నిరసిస్తూ అసోసియేషన్కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సుమలత సిద్ధం కావడంతో ఈ వివాదం చెలరేగినట్టు సమాచారం.
వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం మధ్యాహ్న ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దిగ్గజ గాయని, స్వరసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఆమె కోరిక మేరకు మైసూరులోని తమ ప్రైవేట్ ఎస్టేట్లో వీటిని పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛలనాతో నిర్వహించింది. జానకికి ఆమె మనుమరాలు అప్సర విద్యుల అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం కుడిభుజానికి ఆపరేషన్ జరిగింది. ఆయనను ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. ప్రత్యేకంగా ముంబై వెళ్లిన చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై విషం చిమ్మడాన్ని గొడ్డలి పార్టీ ఆపడం లేదని మండిపడ్డారు.
వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వియత్నాం ప్రమాద బాధితులకు అందిస్తున్న సహాయంపై ఆయన నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
కర్నాటక రాష్ట్ర రవాణా శాఖామంత్రికి బస్సు కండక్టర్ షాకిచ్చారు. సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మారు వేషంలో బయలుదేరిన కర్నాటక రవాణా శాఖామంత్రి భైరతి సురేశ్కు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ కోసం చిల్లర లేకపోవడంతో ఓ బీఎంటీసీ బస్సు కండక్టర్ ఆయన్ను బస్సు దిగిపొమ్మన్నారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
బ్రెజిల్ దేశానికి చెందిన ఓ ప్రేమ జంట ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో దాదాపు 200 ముద్దులు ఇచ్చిపుచ్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్లో చోటుసంపాదించుకుంది. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఫీట్ సాధించడం కథనంలో మరో విశేషం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కళాశాల విద్యార్థిని తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె తన గది గోడపై చాక్ పీస్తో రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. తన చావుకు తన తండ్రి, నానమ్మే కారణమని అందులో పేర్కొనడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన శనివారం నెహ్రూ నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంశుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సోమవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని డోనాల్డ్ ట్రంప్ ఉల్లంఘించి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇరాన్ కఠిన నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్ జట్టుకు తేరుకోలేని దెబ్బతగిలింది. ఐర్లాంట్, ఇంగ్లండ్ జట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు అజేయంగా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్గా ఉన్న భారత్ కిందికి పడిపోయింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో సిరీస్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా భారత్ గెలిచి ఉంటే టాప్ ర్యాంక్ను కాపాడుకొనే అవకాశం ఉండేది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలో సుదీర్ఘంగా ఉన్న అగ్రస్థానం ఘనత చేజారింది.
తెలంగాణ రాష్ట్రంలో తనపై పోక్సో కేసు నమోదు చేశారన్న అక్కసుతో రాజ్కుమార్ అనే వ్యక్తి నరమేధానికి పాల్పడిన విషయం తెల్సిందే. తమ కుమార్తెను వేధించాడంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రాజ్కుమార్పై పోక్స్ కేసును నమోదు చేశారు. దీంతో బాలికతో పాటు బాలిక తల్లి, అమ్మమ్మ, తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు.
వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే అతని ఫోన్లో పలువురు యువతలతో అసభ్యంగా, అశ్లీలంగా గడిపిన వీడియోలు వెలుగు చూశాయి. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఇప్పుడు అతని ల్యాప్ట్యాప్ను కూడా రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్రేటరీకి పంపించి డేటా విశ్లేషణ చేయిస్తున్నారు.
చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల మధ్య పాముల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది; ఒక ఆనకట్ట తెగిపోవడంతో వచ్చిన నీటి ఉధృతికి ఒక స్నేక్ ఫామ్ నుండి సుమారు 900 పాములు బయటకు కొట్టుకువచ్చి నలుదిశలా చెల్లాచెదురయ్యాయి. తప్పించుకుంటున్న ఈ పాములకు సంబంధించిన భయానక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కోబ్రాలు అలా కొట్టుకుపోతుంటే నీటిలో బాతులు అలా పోతున్నాయేమో అని కొందరు భ్రమ పడుతున్నారు.
మానవ సంబంధాలు, బంధాలు, నమ్మకాలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. ఒకరితో రిలేషన్లో వుంటూనే వేరొకర్ని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తమకు అడ్డుగా వున్నారంటూ వారిని తొలగించే క్రమంలో హత్యలు, పారిపోవడాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. పెళ్లయిన 3 రోజులకే తన భార్య ఆమె ప్రియుడితో కలిసి ఓ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్నాడు. పోలీసులను వెంటబెట్టుకుని ఆ హోటల్ వద్దకు వెళ్లాడు. తలుపు కొట్టడంతో ఆమె బైటకు వచ్చింది. లోపల వున్న భార్యను చూసి ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పక్కనే వున్న పోలీసులు అతడిని వారించారు.
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
గురుగ్రామ్: ప్రపంచంలో 4వ అత్యుత్తమ సమయపాలన పాటించే ఎయిర్లైన్గా ఎయిర్ ఇండియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం విడుదల చేసిన జూన్ 2026 ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రకారం, ఆ నెలలో ట్రాక్ చేయబడిన 15,135 విమానాలలో ఎయిర్ ఇండియా 86.85% ఖచ్చితమైన ఎరైవల్ రేట్ (సమయానికి రాక)ను నమోదు చేసింది. ఈ ఎయిర్లైన్ 86.23% ఖచ్చితమైన డిపార్చర్ రేట్ (సమయానికి బయలుదేరటం)ను నమోదు చేయటంతో పాటుగా 99.7% కంప్లీషన్ ఫ్యాక్టర్ను కూడా నమోదు చేసింది, అంటే వాస్తవంగా అన్ని షెడ్యూల్డ్ విమానాలు ప్రణాళిక ప్రకారం నడిచాయి.
Veteran playback singer S Janaki garu passed away, దక్షిణ భారత గానకోకిల ఎస్ జానకి (S Janaki) ఇకలేరు. వయసు సంబంధ సమస్యలు కారణంగా ఆమె కన్నుమూసినట్లు ఆమె మనవరాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి పేర్కొంటూ....నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతంలో జరిగిన ఘోర వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు రాజ్కుమార్ (28) బాలికను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దైహాలగూడలో రాత్రి 11 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ నరమేథానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మన తొలుత హత్య చేసిన నిందితుడు.. ఆ తర్వాత బాలికను బలవంతంగూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేసి వరుస హత్య గురించి చెప్పాడు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంతలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) కీలక ఫైళ్లను విడుదల చేసింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన కొత్త పైళ్ళను విడుదల చేసింది. మొత్తం 40 ఫైళ్లను తన అధికారిక యూఎఫ్వో వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియోలు, మూడు ఫొటోలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్.బి.ఐ, ఇంధన శాఖ వంటి అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించారు. ఎక్కువ భాగం 2010 తర్వాత నమోదైన ఘటనలకు సంబంధించినవే.
అమెజాన్ నౌ సదుపాయం ఉన్న నగరాల్లో, డీల్లో ఉన్న ప్రతి రెండు వస్తువులలో ఒకటి కేవలం నిమిషాల్లోనే డెలివరీ చేయబడటంతో, తమ 10వ ప్రైమ్ డే ఇప్పటివరకు జరిగిన ప్రైమ్ డేలలోకెల్లా అత్యంత వేగవంతమైనదిగా నిలిచిందని అమెజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. ప్రీమియం ఎలక్ట్రానిక్స్, సౌందర్యోత్పత్తుల నుండి నిత్యావసరాల వరకు వివిధ విభాగాలలో వినియోగదారులు అత్యంత వేగవంతమైన డెలివరీలను పొందారు. అదే రోజు డెలివరీలు 3 రెట్లకు పైగా పెరిగి, హోషియార్పూర్, ఉజ్జయిన్, ధార్వాడ్ వంటి టైర్ 2, 3 నగరాలకు కూడా చేరుకున్నాయి.
వియత్నాంలోని మంగళవారం ఫుక్ క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన విషాదకరమైన పడవ ప్రమాదంలో, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురితో సహా కనీసం 15 మంది భారతీయులు మరణించారు. మృతుల వివరాలను వియత్నాం అధికారులు వెల్లడించగా, వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారని, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతులను నల్లపేట ఆదిశేషయ్య రవితేజ, శ్రీధర్ ముడియం, జయ లక్ష్మి గెల్లిగా గుర్తించారు.
పిల్లలే మన సంపద అని, అందువల్ల జనాభాను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణ నినాదం రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు జనాభా తగ్గాలని అందరం కోరుకున్నామని, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చెప్పామన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. పిల్లలే సంపద అనే మాటను నిజం చేస్తామన్నారు.
జైపూరులో కన్నతల్లిని ఓ కుమార్తె కడతేర్చింది. ఆస్తి కోసం స్వంత తల్లిని కారుతో తొక్కించి చంపేసింది. రాజస్థాన్ రాజధాని జయపూర్లో జరిగిన నీరజ్ శర్మ హత్య కేసు విచారణలో పలు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జయపూర్లోని ప్రతాప్ నగర్లో లోయర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్న నీరజ్ శర్మను ఈ నెల 3వ తేదీన ఒక స్కార్పియో వాహనంతో అత్యంత ఘోరంగా ఢీకొట్టి చంపేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే నీరజ్ మృతి కన్నబిడ్డే కారణమని పోలీసులు విచారణలో స్పష్టం అయ్యింది.
Guntur, గుంటూరులో ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలను కారుతో ఢీకొట్టి హత్య చేసే ప్రయత్నం చేసాడు. అంతకుముందు మంగళగిరిలో వారిని హత్య చేయించేందుకు సుపారీ గ్యాంగుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అది కాస్తా బెడిసికొట్టడంతో ఇక లాభం లేదనుకుని అతడే కారుతో రోడ్డుపై వెళుతున్న అత్తామామలను గుద్దేశాడు. తీవ్ర గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. భర్తపై యాసిడ్ దాడి చేసిన భార్యభార్యాభర్తల గొడవలు పలు నేరాలకు కారణమవుతున్నాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక ప్రకారం, జూలై 12, 2026న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు.జూలై 12, 2026 (ఆదివారం) తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 34°C, కనిష్ట ఉష్ణోగ్రత 27°C గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలి పడమర దిశ నుండి గంటకు 14 మైళ్ల వేగంతో వీచే అవకాశం వుంది.
ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలనిచ్చే వ్రతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి నెలా కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ త్రయోదశి తిథినాడు ఆచరించబడుతుంది. ప్రదోష వ్రతం ఆదివారం నాడు వచ్చినప్పుడు, దానిని 'రవి ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శివుడు, సూర్యభగవానుడు ఇద్దరినీ పూజించడం ఎంతో శ్రేయస్కరమని భావిస్తారు. జూలై 2026లో రెండు రవి ప్రదోష వ్రతాలు ఉన్నాయి. మొదటిది 2026 జూలై 12న వచ్చే రవి కృష్ణ ప్రదోష వ్రతం కాగా, రెండవది 2026 జూలై 26న వచ్చే రవి శుక్ల ప్రదోష వ్రతం.
పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స జరిగింది. రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. 2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అయ్యాయి. అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.
అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్తో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్.
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'లెనిన్' బ్లాక్బస్టర్ వేడుకలో నటుడు శివాజీ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సినిమా తన హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమని, మూడు తరాల అక్కినేని కుటుంబంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. దర్శకులు, నటీనటులకు అవకాశాలు ఇచ్చిన నాగార్జున తనయుడు అఖిల్ విజయవంతం కావాలనే తపనను తాను దగ్గర నుంచి చూశానని చెప్పారు. సినిమా కోసం అఖిల్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో కష్టపడ్డారని, నటనతో పాటు నిర్మాణం, ఎడిటింగ్, సంగీతం వంటి ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కొనియాడారు. ఈ విజయం అఖిల్ పూర్తిగా అర్హించిన విజయమని అన్నారు.
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న వెంకట్రామయ్య గారి తాలుకా ఈ చిత్రం ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ఆడుకున్న దిక్కడే లిరికల్ సాంగ్ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. ఇకపై వాట్సాప్ నుంచి ఫార్వర్డ్ చేసిన లేదా స్క్రీన్ షాట్ తీసిన ప్రయాణ టిక్కెట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు రైలు ప్రయాణ సమయంలో టిక్కెట్లను తనిఖీ చేసే టీటీఈలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వాట్సప్ ఫార్వర్డ్ లేదా స్క్రీన్ షాట్ తీసిన టికెట్లు ఇకపై చెల్లబోవని స్పష్టం చేసింది. ఒరిజినల్ టికెట్లనే అనుమతిస్తామని పేర్కొంది. టికెట్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ నుంచి మహేష్ బాబు తో పాటు ఎంతో మంది స్టార్స్ పరిచయం అయ్యారు. నా జీవితంలో కలిసిన బెస్ట్ పర్సన్లలో అశ్విని దత్ గారు ఒకరు. ఆయన నన్ను ఎప్పుడూ మనవరాలిలా చూసుకునేవారు. ఏది కావాలన్నా అడగమని చెప్పేవారు. మా తాతగారితో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. వాళ్లు ముంబైలో కలిసేవారు. ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు చూసినప్పటికీ ఆయన ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్ ఉంటారు అని హీరోయిన్ రాషా తడానీ అన్నారు.
ఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్కు చెందిన విద్యార్థి మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్కు చెందిన 18 ఏళ్ల మణిదీప్ రెడ్డి గుజ్జగా గుర్తించారు. హెల్సింకిలోని క్రూనువోరెన్రాంటా తీరప్రాంత సముద్రంలో జరిపిన గాలింపు చర్యల్లో జూలై 9న అతని మృతదేహం లభ్యమైంది. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం దీని వెనుక ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత చర్య ఉన్నట్లు అనుమానాలు లేవు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
బుల్లెట్ ట్రైన్ హబ్గా తెలంగాణ రాష్ట్రం అవతరించనుందని కేంద్రం మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏడు బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఏకంగా మూడు బుల్లెట్ రైళ్లు తెలంగాణాకు దక్కనుంది. ఈ విషయాన్ని మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ఇడుపు కాయితం. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
టీజర్, ఫస్ట్ సింగిల్తో అంచనాలను పెంచిన 'ఓ..! సుకుమారి' ఇప్పుడు గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, 'శివం భాజే' విజయం తర్వాత గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈరోజు, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణీ, ప్రఖ్యాత ఫార్చ్యూన్ ఇండియా వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితాలో స్థానం సంపాదించి, ఒక అరుదైన, ప్రతిష్టాత్మకమైన గుర్తింపును పొందారు. కార్పొరేట్ రంగంలో ఆమె ప్రభావవంతమైన నాయకత్వాన్ని, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఆమె పోషించిన పాత్రను ఈ పురస్కారం హైలైట్ చేస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన అధికారిక ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో, దేశ ఆర్థిక స్వరూపాన్ని తీర్చిదిద్దుతున్న మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ నాయకుల ఉన్నత వర్గంలో చేరి, నారా బ్రాహ్మణీ లాంఛనంగా ఈ అవార్డును అందుకున్నారు.
అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సె నాయికగా నటించిన సినిమా లెనిన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని వేడుకగా నేడు అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అంతకుముందు అంటే ఏడాదిన్నరకు ముందు తండేల్ సినిమా అప్పుడు తిరుమల వెళ్ళి వేంకటేశ్వరస్వామిని ఒక్క హిట్ ఇవ్వు అన్నాను. అలాగే ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్ విషయంలో లెనిన్ టైంలో అలానే అడిగాను.
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి సెంటర్ను పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.16.7 కోట్లను వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ ఓ పోస్టరును విడుదల చేసింది. అదేసమయంలో రెండో రోజు కూడా టికెట్ బుకింగ్స్లో జోరు చూపిస్తోందని వెల్లడించింది. అఖిల్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈసినిమాను నాగార్జున, నాగవంశీ నిర్మించారు.
అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ డ్రామా లెనిన్ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్లోని మూసాపేటలో ఉన్న శ్రీ రాములు థియేటర్లో అఖిల్ భార్య జైనాబ్ రావ్డ్జీ అభిమానులతో కలిసి మొదటి రోజు షో చూడటం ఈ చిత్రానికే హైలైట్గా నిలిచింది. అఖిల్ వెండితెర పునరాగమనాన్ని పురస్కరించుకుని, అభిమానులు కేరింతలు, చప్పట్లతో పండుగ వాతావరణంలో ఆమెకు ఘనస్వాగతం పలికారు.
విజయనగరం జిల్లాకు చెందిన వైజాగ్ టెక్కి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతని వద్ద మరిన్ని వివరాలను రాబట్టేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్కు ముంబై ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆయన రెండు భుజాలకు ఆపరేషన్ చేయాల్సివుండగా, శనివారం మాత్రం ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు.
గత వైసిపి పాలనలో గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎలా వున్నదో సోషల్ మీడియాలో అప్పట్లో విపరీతంగా వీడియోలో వైరల్ అవుతుండేవి. ఈ కారణంగా వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీలోని రోడ్ల నాణ్యత పరిస్థితి 19వ స్థానంలో వుండేది. ఐతే కూటమి ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టించారు. ఈ కారణంగా ఏపీకి రోడ్ల నాణ్యత విషయంలో 2వ స్థానం వచ్చింది. కేంద్ర బృందం తనిఖీల్లో ఒక్కరోడ్డు మాత్రం ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడంతో ఫస్ట్ ర్యాంక్ జస్ట్ మిస్ అయ్యింది.