ఇరుముడి చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత కథానాయిక ప్రియా భవాని శంకర్ ఇన్ స్ట్రాలో తన అనుభవానలుు పంచుకుంది. ఇప్పుడు... మేము కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాము, ఎన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నాము, మా మధ్య మాత్రమే అర్థమయ్యే కొన్ని సరదా జోకులు పంచుకున్నాము, అసలు నవ్వు తెప్పించని విషయాలకు కూడా నవ్వుకున్నాము, మొత్తానికి ఎలాగోలా ఒక సినిమాని పూర్తి చేశాము అంటూ పేర్కొంది.
భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరధిలోని మారుతీ నగర్లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా దపంతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్.. భార్య నిషారాణిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ రోజు గుజరాత్లోని జామ్నగర్లో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం మెటా ప్లాట్ఫార్మ్స్(Meta)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. RIL 168 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ను అభివృద్ధి చేసి, రెండు సంవత్సరాల్లో అందించనుంది. అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుంది.భారతదేశంలో మెటా కోసం ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా (Built-to-Suit) నిర్మించబడుతున్న తొలి డేటా సెంటర్ ఇదే. ఇది AI మౌలిక సదుపాయాల కోసం భారతదేశం ప్రపంచ కేంద్రంగా ఎదుగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ సదుపాయం నుంచి మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనుంది.
హైదరాబాదులో కురిసిన వర్షానికి నగరజీవులు గంటలకొద్దీ ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయారు. మరికొంతమంది తమ వాహనాలను రోడ్లపైనే వదిలేసి మెట్రో రైలు కోసం బారులుతీరారు. వేలమంది ఒక్కసారిగా మెట్రోకి తరలిరావడంతో అక్కడ జనసందోహం భారీగా కనిపించింది. దీన్ని వీడియోలో చూపిస్తూ ఓ నెటిజన్... ఇది తిరుమల క్యూ లైన్ అని పొరపాటు పడవద్దు. హైదరాబాదులో పడిన వర్షానికి మెట్రోలో వెళ్లడానికి ప్రయాణికులు కట్టిన క్యూ ఇది అని పేర్కొన్నాడు.
మంగళవారం నాడు హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ వర్భ బీభత్సంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆంధ్ర రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ... మీ నగరం మునిగిపోతుంది, సీఎం కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి, ముందు అది చూసుకో పవన్ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి.ఓ నెటిజన్ స్పందిస్తూ.... హైదరాబాద్ డెవల్మెంట్ అయింది బ్రో. జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే. మీ ఆంధ్రవాళ్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లంకి పరిష్కారం దొరకట్లేదు.
‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్పుట్ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై సినీ హీరో, పవర్ స్టార్, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రముఖ దర్శకులు శ్రీ భారతీరాజా గారి మ్రుతిపట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్, కె రాఘవేంద్రరావు తోపాటు చిరంజీవి, బాలక్రిష్ణ, మోహన్ రాజా పలువురు తమ సానుభూతి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సంతాపాన్ని ప్రకటిస్తూ, శ్రీ భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై శ్రీ భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది.
పశ్చిమాసియా మరోమారు రణరంగంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి సమీపంలో అపాచీ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గట్టిగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక, ఇతర స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడుగా గుర్తింపు పొందిన భారతీరాజా ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ '16 వయథినిలే' (తెలుగులో పదహారేళ్ల వయసు)తో దర్శకుడిగా మారారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఇద్దరు వ్యక్తుల హత్యకు కారణమైంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార నష్టాలతో సతమతమవుతున్న ఓ వస్త్ర వ్యాపారి, తన భార్య, కొడుకును హతమార్చి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
రుచి ఇంద్రియాల్లో ఏ విధంగా అనుభవించబడుతుంది పునః ఊహించడానికి రూపొందించబడిన ఒక కొత్త సాంస్కృతిక ప్లాట్ ఫాం బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్డ్ ఎక్స్పీరియెన్సెస్ను ప్రారంభించిన బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. వినియోగదారులు తమ సొంత అభివృద్ధి చెందుతున్న రుచులు, ఎంపికలను చూపించే మరింత అర్థవంతమైన, మెరుగైన అనుభవాల వైపు ఆసక్తి చూపిస్తున్న సమయంలో, బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్డ్ ఎక్స్పీరియెన్సెస్ రుచిని మరింత ఏదో వ్యక్తీకరణగా మార్చడం ద్వారా ఈ మార్పుకు ప్రతిస్పందించింది.
మంగళవారం నాడు హైదరాబాదులో Monsoon rains గాలివాన బీభత్సానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.బండ్లగూడ సమీపంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు వర్షంలో తెగి పడి వున్న విద్యుత్ తీగలను చూసుకోకుండా వాటిని తగులుకున్నారు. దాంతో వారు అక్కడికక్కడే విద్యుత్ షాక్ కారణంగా మృత్యువాత పడ్డారు. మృతి చెందినవారు చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్షాప్లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
క్లాసిక్స్ మాంచెట్ రెండు కొత్త రూపాలతో తిరిగి వచ్చింది. ఒకటి ప్రత్యేకమైన మినరల్ ఎడిషన్, మరొకటి సన్రే డయల్. రాక్ ఎడ్జ్ శైలిని కలిగి ఉన్న ఈ జంట గడియారాలు, గోల్డ్-టోన్, స్టీల్ బ్రాస్లెట్లలో లభిస్తాయి. ఈ రెండు కొత్త మోడళ్లు శాశ్వత సేకరణలో భాగమయ్యాయి, ఇవి స్వేచ్ఛాయుతమైన మరియు గ్లామ్-చిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.క్లాసిక్స్ మాంచెట్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. జెనీవాలో జరిగిన వాచెస్ అండ్ వండర్స్ కార్యక్రమంలో, ఈ తిరుగుబాటు సౌందర్యం అందరి దృష్టిని ఆకర్షించింది.
హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుజుకీ మోటార్ కార్పొరేషన్, జపాన్ వారి టూ-వీలర్ అనుబంధ సంస్థ హైదరాబాద్, తెలంగాణలో బర్గ్ మన్-అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్ని విజయవంతంగా నిర్వహించింది. స్కూటర్ ఔత్సాహికులను ఒక చోట చేర్చింది. కస్టమర్లకు విలక్షణమైన రైడింగ్ అనుభవం ఇచ్చింది, సుజుకీ స్కూటర్ల డిజైన్, సౌకర్యం, పనితీరును విజయవంతమైన వేడుక చేసింది. ఈ కార్యక్రమానికి సుజుకీ బర్గ్ మన్, అవెనిస్ కస్టమర్లు పాల్గొన్నారు, ప్రముఖ నగర మార్గాల్లో ఆకర్షణీయమైన ఆన్-రోడ్డు ఉనికిని సృష్టించారు. SMIPL వారి పెరుగుతున్న సుజుకీ సమాజాన్ని పునః శక్తివంతం చేసారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంగ్రహస్థితి ఆశాజనకం. పరిస్థితులు చక్కబడతాయి కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవచ్చు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. రోజువారి ఖర్చులే ఉంటాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలువ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
శాస్త్రాల ప్రకారం మానవులు చేసే స్నానాలను నాలుగు రకాలుగా విభజించారు. ఇప్పటి బిజీ జీవితాల్లో చాలామంది మొదటి రెండు రకములైన ఉత్తమ స్నానాలను చేయడం సాధ్యం కావడంలేదని చెప్తుంటారు. ఇక మూడోరకమైన స్నానం కాస్త అటుఇటూ ఆచరిస్తున్నారు. ఎక్కువగా చేస్తున్నది మాత్రం రాక్షస స్నానాలే వుంటున్నాయి. అసలు 'రాక్షస స్నానం' అంటే ఏమిటి?హిందూ సాంప్రదాయం, పురాణాల ప్రకారం, సూర్యోదయం అయిపోయిన చాలా సేపటికి... అంటే ఉదయం 8 లేదా 9 గంటల తర్వాత ఆలస్యంగా నిద్రలేచి, అప్పటివరకు స్నానం చేయకుండా కాలం గడిపి, ఆ రోజూ చేసే మొదటి స్నానాన్ని 'రాక్షస స్నానం' అంటారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మహిళా మంత్రిపై తమిళనాట ప్రముఖ యూ ట్యూబర్ మారిదాస్ అసభ్యకరమైన వీడియోను చేసి పోస్ట్ చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనితో అతడిపై చెన్నై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదయ్యింది. సోమరవారం ఉదయం మధురైలోని అతడి నివాసానికి చెన్నై పోలీసులు వెళ్లారు. మధురై నగర పోలీసులను వెంటబెట్టుకుని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసారు.కాగా మారిదాస్ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలోని మహిళా మంత్రితో పాటుగా మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 352(2) కింద కేసు నమోదు చేసారు.
బిర్యానీ విషయంలో ఏర్పడిన గొడవ దంపతుల ప్రాణాలను తీసింది. ఈ గొడవలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ నాలుగేళ్ల కుమారుడిని మరిచిపోయారు. విశాఖపట్నంలో ఈ అత్యంత విషాదకర ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (30) దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చి, ఇక్కడి శ్రీనగర్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఒక మైనర్ బాలికపై ఓ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖమ్మం నగరంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న 12 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి, ఓ కిరాతకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన అకృత్యాన్ని దాచేందుకు, సదరు నిందితుడు ఆ బాలికను అపార్ట్మెంట్ భవనం పైనుంచి కిందకు తోసేశాడు. జూన్ 6న జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మొదట ప్రమాదంగా భావించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు.. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలికపై అఘాయిత్యం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో షాకయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బోరున విలపించారు. తమ కుటుంబానికి చెందిన చిరకాల మిత్రురాలు, అత్యంత ఆత్మీయురాలైన కుముద్ రాణే తుదిశ్వాస విడవగా ఆమె అంత్యక్రియల్లో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సల్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, స్నేహితురాలికి వీడ్కోలు పలికారు.
ఈరోజుల్లో వీధి కుక్కలు ఎక్కడబడితే అక్కడ జనాల్ని కరుస్తున్నాయి. వాటి జోలికి వెళ్లకపోయినా కూడా పిక్కల్ని పట్టి పీకుతున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కుక్కల బెడదను వదిలించాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. ఐనా వీధి కుక్కల బెడద మాత్రం పోవడంలేదు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ మెడికల్ సెంటర్లో కుక్కకాటుకి గురై ర్యాబిస్ వ్యాధిన బారినపడ్డ వ్యక్తికి సంబంధించిన విపరీత చర్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అతడిని కొన్ని వారాల క్రితం కుక్క కరిచిందట. ఏముందిలే మన కుక్కే కదా.... ఏం చేస్తుందని వదిలేసారట.
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సిద్ధుగాడి లవ్ స్టోరీ. రమేష్ చెరుకూరు దర్శకుడు. ట్రైలర్ విడుదల జరిగింది. దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాదాపు ఒకే రకమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. 2027లో తాను చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వైఎస్ జగన్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ రాబోయే కొద్ది నెలల్లో సిద్ధం కానుంది. దీంతో 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు జగన్ ప్రజల మధ్యే ఉంటారన్నది మాత్రం ఖాయం.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో రూపొందిన చిత్రం వంద దేవుళ్ళు. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ట్రైలర్ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.జూన్ 19న విడుదల చేయబోతోన్నారు
నంబర్ 1 ఏఐ సిఆర్ఎం అయిన సేల్స్ఫోర్స్, 2030 నాటికి భారతదేశవ్యాప్తంగా పది లక్షల మంది అభ్యాసకులకు ఏఐ-కేంద్రీకృత నైపుణ్యాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఈరోజు వెల్లడించింది. సేల్స్ఫోర్స్ ఇండియా యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)10 సంవత్సరాల ఆవిష్కరణ, వృద్ధిని వేడుక జరుపుకుంటున్న తరుణంలో ఈ అంశాన్ని వెల్లడించారు. పది లక్షల మంది అభ్యాసకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే ఈ నిబద్ధత కేవలం డిజిటల్ అక్షరాస్యతకు మాత్రమే పరిమితం కాదు, ఇది భారతదేశ శ్రామిక శక్తిని భవిష్యత్ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది.
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫారియా అబ్దుల్లా కథానాయికగా కనిపించనున్నారు. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు తాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
'DJ టిల్లు'తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన 'చిలక ప్రొడక్షన్స్' బ్యానర్పై 'అనుమాన పక్షి' అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్ మయూర్తో జతకట్టారు. రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి దుర్గా తేజ్ SYG (సంబరాల ఏటిగట్టు) తో సిద్ధమవుతున్నాడు. హనుమాన్ బ్లాక్బస్టర్ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం.. రోహిత్ కె.పీ దర్శకత్వంలో, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్-10కు హోస్ట్గా తిరిగి రానున్నారు. ఈ షో నిర్వాహకులు రాబోయే సీజన్ కోసం ఒక కొత్త ప్రోమోను విడుదల చేశారు. అయితే ప్రసార తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో, షూటింగ్ సెట్ల నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య భారీగా షేర్ అవుతున్నాయి. షో ప్రారంభానికి ముందే పోటీదారుల గురించి రకరకాల ఊహాగానాలు రావడం సహజమే.
నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్.బి.కె 111 నుంచి సర్ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని టాక్. 'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్' అని అంచనాలు పెంచారు గోపీచంద్ మలినేని. 'పెద్ది' తర్వాత వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
కర్నాటక ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. యాపిల్ పండ్లను కొరికి ఆ ఎంగిలి యాపిల్ పండ్లను జనం పైకి విసిరేసారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింతో తెలుసుకుందాము.ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన డీకె శివకుమార్ కి కనకపురలో ఆయన మద్దతుదారులు భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసారు. అక్కడ ఆయన మద్దతుదారులు ఆయనకు యాపిల్ పండ్లు, పూలతో తయారుచేసిన దండను బహూకరించారు. ఆ దండలో వున్న యాపిల్ పండ్లను చేతితో అందుకున్న డీకె కొరికి ఆ ఎంగిలి పండ్లను జనంపైకి విసిరేసారు.
స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ అన్నారు. ఈ తరహా విధానం కేవలం దక్షిణాదిలోనే కాకుండా యావత్ చిత్రపరిశ్రమలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' చిత్రం 4వ తేదీన విడుదలైంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భారత్ మండపంలో జరగనున్న ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరై, చర్చల్లో పాల్గొంటారు.
పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అందువల్ల అవి వివాదాస్పదం కావడంతో ఆ సన్నివేశాలను తొలగించినట్టు ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 4వ తేదీన విడుదలై బాక్సీఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ను మరింత గ్లామర్గా, శృంగారంగా చూపిచారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ, ఆ వివాదాస్పద సన్నివేశాలను తొలగించామన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుండగా తెలుసుకున్న సదరు భర్త ఆమె ముక్కు కోసేసిన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకున్న 6 నెలలకే అతడి భార్య రీనా పక్కింట్లో వుండే అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి రీనా మేడ పైకి వెళ్లింది.పక్కింటి మేడ పైనుంచి దుమికి ఈమె వద్దకు వచ్చిన ప్రియుడు ఆమెతో సరససల్లాపాల్లో మునిగిపోయాడు. అదేసమయంలో భర్త రాహుల్ మేడపైకి వచ్చేసాడు. అతడి రాకను గమనించిన ప్రియుడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖకు చేరుకున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను అడిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం, ఉన్నతాధికారులతో మాట్లాడారు.
తెలంగాణలోని మల్కాజ్ గిర్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు,కూతురుకి మరణ శిక్ష విధించింది. భర్త హత్యకు సహకరించిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ను 2019 ఆగస్టు 16న స్వయంగా ఆయన కొడుకు, కుమార్తె కలిసి దారుణంగా హత్య చేసారు.అతడికి వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకులో వున్న సొమ్మును తీసుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రికి ఉమ్మెత్త పువ్వులు, కాయలు ఎండపెట్టి ఆ చూర్ణాన్ని కలిపి భోజనం పెట్టారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం సాయంత్రం జరిగిన విషాదకరమైన పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సమగ్ర పరిహార ప్యాకేజీని ఆయన ప్రకటించారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, నెలవారీ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 45.7 లక్షలు, నెలవారీ పీఎఫ్ పెన్షన్ అందించబడుతుందని పవన్ అన్నారు. అదనంగా, మరణించిన ప్రతి ఉద్యోగికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది.
తన పెంపుడు కుక్క మైకీని కొట్టి చంపేసారంటూ బాలీవుడ్ నటి మంజరి ఫడ్నవిస్ కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెళ్లబుచ్చారు. తమ సొసైటీలో తన పెంపుడు కుక్క మైకీని అత్యంత దారుణంగా కొట్టి చంపేసారంటూ ఆమె విలపించారు. 2019 నుంచి ఆ కుక్క తమతోనే వున్నదనీ, ఆ కుక్క వాళ్లని ఏం చేసిందని చంపారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.కుక్కను చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసారు. మంజరి ఆవేదన పట్ల జంతు ప్రేమికులు సైతం బాధను వ్యక్తం చేసారు. ఖచ్చితంగా కుక్కని చంపిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు కూడా మద్దతు పలికారు.
కాచిగూడలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. మే 27 నుండి కాచిగూడలో కనిపించకుండా పోయిన బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి అంకం రాహుల్, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బావి వద్ద శవమై కనిపించాడు.తాను ప్రేమ లేఖ రాసిన ఒక అమ్మాయికి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడంతో రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మే 27న కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వద్ద బయటకు వెళ్తున్నానని తనను ద్విచక్ర వాహనంపై అక్కడికి చేర్చిన స్నేహితుడికి చెప్పిన తర్వాత, 21 ఏళ్ల రాహుల్ ఆచూకీ తెలియకుండా పోయిందని కాచిగూడ పోలీసులు పేర్కొన్నారు. అతని తండ్రి అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని వెల్లడించారు. టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో తాజాగా మాట్లాడారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఏపీ వాతావరణ పరిస్థితులపై ప్రకటన చేశారు. మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉరుములతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు.ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ చిత్రాన్ని చూసి రామ్ చరణ్ నటను మెచ్చుకున్నారు. చరణ్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు.
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ. 10 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రమాద ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని వేస్తాం.
వరల్డ్ కప్ 2026 కోసం రూపొందించిన కొత్త పాట ఎట్టకేలకు విడుదలైంది. ఇందులో బాలీవుడ్ తార నోరా ఫతేహి కనిపించారు. సీర్ సీర్ అని పేరున్న ఈ పాటను మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్, ఫ్రెంచ్ గాయకుడు వెజ్డ్రీమ్తో కలిసి రూపొందించారు. ఇది ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక సంగీత ప్రాజెక్ట్లో భాగంగా, టోర్నమెంట్ అధికారిక ఆల్బమ్లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంగీత నేపథ్యాలు కలిగిన కళాకారులను ఈ ఆల్బమ్ ఒకచోట చేర్చుతుంది. నోరా ఫతేహి సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ పాటను పంచుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 వంటి కార్యక్రమంలో సీర్ సీర్ పాటను భారతదేశం బలమైన ప్రాతినిధ్యంగా నోరా ఫతేహి అభివర్ణించారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకూ సుమారు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం పంపిణీ చేసారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకూ ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ప్రతి ఏటా చేప ప్రసాదం తీసుకోవడం వెనుక ప్రధానంగా ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నివారణకు ఒక సాంప్రదాయ నివారణోపాయంగా ప్రజలు నమ్ముతారు. దీని వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర, నమ్మకాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన కారణాలు ఉన్నాయి.