వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి- ఎంబసీతో మాట్లాడిన నారా లోకేష్
Vietnam Boat Tragedy
ఈ ఘటన బాధితుల కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా, వారికి సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హో చి మిన్ సిటీలోని కాన్సులేట్ కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు, అలాగే మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి అవసరమైన సమన్వయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి. ప్రాణనష్టం పట్ల అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ హృదయ విదారక ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ (ఇండియన్ ఎంబసీ) అధికారులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాద స్థలంలో ఉన్న బాధితులకు తక్షణమే అవసరమైన అన్ని రకాల అత్యవసర సహాయ సహకారాలు అందించాలని ఆయన ఎంబసీ అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
