కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)
కుబేర. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన ప్రధాన తారాగణంతో తెరకెక్కిన చిత్రం కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చిత్రాన్ని చూసేందుకు హీరో ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ కి వెళ్లారు. అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి ధనుష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చానాళ్ల తర్వాత ఓ మంచి సినిమా చూసామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విడుదలైన ఫస్ట్ షో నుంచే కుబేర చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. శేఖర్ కమ్ముల తీసుకునే పాయింట్ చాలా సూటిగా వుండటమే కాకుండా ఆయన చిత్రాల్లో వినోదం, సందేశం మేళవించి వుంటాయి. మొత్తమ్మీద ధనుష్ కుబేర చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.