Astrology Weekly Horoscope Details

Notifications

తుల తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గురువారం నాడు ఆచితూచి అడుగేయాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త, దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. అస్వస్థతకు గురవుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు.

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్టఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు నగర సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర న్యాయ ఉపశమనాన్ని కల్పించింది. ఆయనపై ధృవీకరించని భూకబ్జా, ఆక్రమణల ఆరోపణలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కోర్టు జాన్ డో నిరోధక ఉత్తర్వును జారీ చేసింది. మే 29 నుండి జూన్ 1, 2026 మధ్య ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, కథనాలు, సోషల్ మీడియా పోస్టుల వెల్లువ కారణంగా ఈ న్యాయ వివాదం తలెత్తింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోడి చెరువు తిరుసభను అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ, వైరల్ అయిన ఆ కంటెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు, పవన్ కళ్యాణ్ న్యాయ బృందం ఈ ఆరోపణలను ఖండించేందుకు ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను టెక్ మధ్యవర్తులకు పంపింది.

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?పానీపూరీ తిన్న 15మంది పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పానీపూరి తిన్న సుమారు 15 మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పానీ పూరీ తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయివుంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీసుల వివరాల ప్రకారం, కాలనీలోకి వచ్చి పానీపూరి విక్రయించే ఒక వీధి వ్యాపారి దగ్గర పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత 15 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు