తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,277 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 4నిండాయి. వారికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా గురువారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.