తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 68,707మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 5 గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది.
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది