సుఖనిద్ర కోసం ఈ మంత్రాన్ని పఠించండి.
ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర కోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే సుఖ నిద్రకు ఢోకా వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
ఆ మంత్రం ఏమిటంటే..
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలం|
కపిలో ముని రాసీక్తః పంచైతే సుఖశాయినః ||
అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిద్రించేవారిలో ముఖ్యులు వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే సుఖంగా నిద్రపడుతుంది.