శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By CVR
Last Updated : సోమవారం, 5 జనవరి 2015 (12:17 IST)

తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లు

తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక అతి సులభతరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ విషయమై టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం శ్రీవారి దర్శన టిక్కెట్లను వాడ వాడల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ-దర్శనం పద్దతి ద్వారా దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్ల విక్రయాలని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా ఇప్పటికే శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లను టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చింది.