బాలాదిత్య, గాయత్రి జంటగా త్రిమూర్తి సెల్యులాయిడ్ పతాకంపై గణమురళి దర్శకత్వంలో నిర్మాత బైరయ్యగుప్తా నిర్మిస్తున్న "సంధ్య" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రీ రికార్డింగ్ జరుపుకోటోంది. సూపర్ గుడ్ థియేటర్లో రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామని సహ నిర్మాత సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ చిత్రం కథపై దర్శకుడు గణమురళి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని హీరోయిన్కు చదువంటే పంచప్రాణాలని, ఎలాగైనా కష్టపడి చదివి డాక్టర్ కావాలన్నదే ఆమె ఆశయం. అయితే.. ఇంట్లో తండ్రి ప్రోత్సాహం లేకపోవడంతో ఏమి చేయాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఆమెకు ఓ యువకుడు పరిచయమవుతాడు. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే ఆ యువకుడు.. చదువుకోవాలనే తపన పడే యువతిని చూశాక కొంత మార్పు కనిపిస్తుంది. ఆమె ఆయన సాధన కోసం పాటుపడతాడు.
ఈ రెండు పాత్రలను హీరోహీరోయిన్లైన బాలాదిత్య, గాయత్రిలు పోషించారని చెప్పారు. అనంతరం నిర్మాత బైరయ్య మాట్లాడుతూ.. చక్కని సందేశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. సంధ్య చిత్రానికి మాటలు.. సాగర్, సంగీతం.. గణేశ్ చక్రవర్తి, కెమెరా.. రామ్ కుమార్, సమర్పణ.. గద్దె మురళి, కథ, స్క్రీన్ ప్లే, డిజైనింగ్, దర్శకత్వం.. గణమురళి.