రెండు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ''జాతీయ అవార్డు''
కేంద్రం తాజాగా ప్రకటించిన 53వ జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు బొమ్మలాట (తెలుగు)కు దక్కింది. ఇంగ్లీష్లో దీని పేరు "బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్". డాక్టర్. డి.రామానాయుడు మనుమడు దగ్గుబాటి రాణా నిర్మాత. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.ప్రకాశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరూ ఫిలిం ఇన్స్స్టిట్యూట్లో కోర్సును అభ్యసించినవారే. ఇరువురి కుటుంబాలు చలన చిత్రరంగానికి ముడిపడినవే.
ప్రస్తుతం రాణా విదేశాల్లో ఉండగా, ప్రకాశ్ ముంబైలో ఉన్నారు. ఈ నెల 15వ తేదీన వీరిద్దరూ హైదరాబాద్ రానున్నారు. అవార్డు విషయం తెలిసి అనంతరం ఇద్దరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన బాలనటుడు సాయికుమార్కు ఉత్తమ బాలనటుని అవార్డు దక్కడం మరో విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం కె.రాఘవేంద్రరావు, డి.సురేష్బాబు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
మూడు తరాల బంధం: దర్శకేంద్రుడు
ఈ సందర్భంగా కె.రాఘవేంద్ర రావు విలేకరులతో మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో తమది మూడు తరాల బంధమనీ, పుత్రోత్సాహంతో తామెంతో ఆనందంగా ఉన్నామని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మనసులోని మాటను వ్యక్తం చేశారు. రామానాయుడుగారు, మా తండ్రిగారు ప్రకాశ్గారితో "ప్రేమ్నగర్" "వసంతం" చిత్రాలతో మొదలైన బంధం క్రమేణా బలపడింది. ఆ తర్వాత నా తరంలో "దేవత" ద్వారా వెంకటేష్ పరిచయం చేశాను.
ప్రస్తుతం డి.సురేష్బాబు తనయుడు దగ్గుబాటి రాణా, మా అబ్బాయి ప్రకాశ్ కలయిక మరింత బలపడి జాతీయస్థాయిలో గుర్తింపుతో తామెంతో పుత్రోత్సాహంతో ఉన్నామని పేర్కొన్నారు. సినిమాకు అంకితమైన కుటుంబాల్లో తనదొకటని రాఘవేంద్రరావు చెప్పారు. మా కుటుంబానికి సినీరంగానికి 70సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు రుణపడి ఉన్నామన్నారు.
ఇది మూడో అవార్డు: డి.సురేష్ బాబు
తమ కుటుంబానికి జాతీయస్థాయి అవార్డులు దక్కడం ఇది మూడోసారని నిర్మాత డి.సురేష్బాబు అన్నారు. నాన్నగారు, రామానాయుడు తీసిన బెంగాలీ సినిమా "ఆశూఖ్"కు జాతీయఅవార్డు వచ్చింది. ఆ తర్వాత మా నిర్మాణ సంస్థలో "కలిసుందాం రా" చిత్రానికి, ఇపుడు మా అబ్బాయి రాణాకు నిర్మించిన "బొమ్మలాట"కు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బాలనటునిగా నటించిన తనకు జాతీయ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాలనటుడు సాయికుమార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం రాణా విదేశాల్లో ఉండగా, ప్రకాశ్ ముంబైలో ఉన్నారు. ఈ నెల 15వ తేదీన వీరిద్దరూ హైదరాబాద్ రానున్నారు. అవార్డు విషయం తెలిసి అనంతరం ఇద్దరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన బాలనటుడు సాయికుమార్కు ఉత్తమ బాలనటుని అవార్డు దక్కడం మరో విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం కె.రాఘవేంద్రరావు, డి.సురేష్బాబు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
మూడు తరాల బంధం: దర్శకేంద్రుడు
ఈ సందర్భంగా కె.రాఘవేంద్ర రావు విలేకరులతో మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో తమది మూడు తరాల బంధమనీ, పుత్రోత్సాహంతో తామెంతో ఆనందంగా ఉన్నామని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మనసులోని మాటను వ్యక్తం చేశారు. రామానాయుడుగారు, మా తండ్రిగారు ప్రకాశ్గారితో "ప్రేమ్నగర్" "వసంతం" చిత్రాలతో మొదలైన బంధం క్రమేణా బలపడింది. ఆ తర్వాత నా తరంలో "దేవత" ద్వారా వెంకటేష్ పరిచయం చేశాను.
ప్రస్తుతం డి.సురేష్బాబు తనయుడు దగ్గుబాటి రాణా, మా అబ్బాయి ప్రకాశ్ కలయిక మరింత బలపడి జాతీయస్థాయిలో గుర్తింపుతో తామెంతో పుత్రోత్సాహంతో ఉన్నామని పేర్కొన్నారు. సినిమాకు అంకితమైన కుటుంబాల్లో తనదొకటని రాఘవేంద్రరావు చెప్పారు. మా కుటుంబానికి సినీరంగానికి 70సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు రుణపడి ఉన్నామన్నారు.
ఇది మూడో అవార్డు: డి.సురేష్ బాబు
తమ కుటుంబానికి జాతీయస్థాయి అవార్డులు దక్కడం ఇది మూడోసారని నిర్మాత డి.సురేష్బాబు అన్నారు. నాన్నగారు, రామానాయుడు తీసిన బెంగాలీ సినిమా "ఆశూఖ్"కు జాతీయఅవార్డు వచ్చింది. ఆ తర్వాత మా నిర్మాణ సంస్థలో "కలిసుందాం రా" చిత్రానికి, ఇపుడు మా అబ్బాయి రాణాకు నిర్మించిన "బొమ్మలాట"కు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బాలనటునిగా నటించిన తనకు జాతీయ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాలనటుడు సాయికుమార్ పేర్కొన్నాడు.