గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » వేణుమాధవ్ "ప్రేమాభిషేకం" షూటింగ్ ప్రారంభం
కథనాలు
Feedback Print Bookmark and Share
 
కొద్దిరోజులకు అర్థరాత్రి 11 గంటలకు లాండ్‌ఫోన్ వచ్చింది. ఈ టైమ్‌లో ఎవరబ్బా? అని రిసీవ్ చేశాను. దాసరి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఇంటికి వస్తారా? అన్నది సారాంశం. తెల్లవారి వెళ్ళి కలిశా... మంచి కథ దొరికింది... నువ్వన్నట్లు టైటిల్‌కూడా "ప్రేమాభిషేకం". కానీ "వీడికి క్యాన్సర్ లేదు" అనేది కాప్షన్ అని చెప్పారు. నాకు ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడో అడిగిన కథను ఇలా కొద్దిరోజులకే ఇస్తారను కోలేదని... ఆయనకు జన్మాంతం రుణపడి ఉంటానని వేణు వెల్లడించాడు.

ఈ చిత్రాన్ని వేణుమాధవ్ సోదరులు త్రివిక్రమ్, గోపాలకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారికి మరో స్నేహితుడు జి. విజయ్‌కుమార్ గౌడ్ కూడా జతయ్యాడు. వీరందరి సహకారంతో తాను హీరోగా నటిస్తున్నానని, ఇందులో హీరోయిన్స్‌కు పెద్ద ప్రాధాన్యత ఉండదని వేణుమాధవ్ పేర్కొన్నారు. ఇందులో అద్భుతమైన పాత్రను శ్రీహరి పోషిస్తుండగా, మరో పాత్రను నాగబాబు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.... కామెడీలో మా ఇద్దరి మధ్య కాంపిటేషన్ ఉంటుందని వేణుమాధవ్‌నుద్దేశించి అన్నారు. తనపాత్ర చాలా సీరియస్‌గా ఉన్నా చూసేవాడికి కామెడీని తెప్పిస్తుందనీ, ఓ రౌడి వేషం వేస్తున్నానని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ... శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై... నవంబర్, డిసెంబర్, జనవరిలలో షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. మార్చినెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

దాదాపు కమేడియన్స్ అంతా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: వాసు, కథ: దాసరి నారాయణరావు, మాటలు: రామస్వామి, ప్రవీణ్ వర్మ, శ్రీనివాసులు, వేణుమాధవ్, పాటలు: చంద్రబోస్, దర్శకత్వం: ఎస్. ఎస్. విక్రమ్ గాంధీ.