రిషి, సామ్రాట్, గోపిక హీరోహీరోయిన్లుగా రవిశర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'వీడు మాయలోడు కాదు' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ముక్కోణపు ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. ఈ సందర్భంగా.. నిర్మాతలు నరసింహారెడ్డి, అశోక్ యాదవ్లు మాట్లాడుతూ.. ఎస్ఏ.రాజ్కుమార్ సంగీతబాణీలు చక్కగా ఉన్నాయి.
రిషి, గోపిక చక్కను నటన ప్రదర్శించారు. రెండో సినిమాకే సామ్రాట్ బాగా అభినయించాడు. భాస్కరభట్ల రవి, అశోక్తేజ సంగీతం ఆకట్టుకునేలా ఉందన్నారు. మంచి కథాబలం ఉన్న చిత్రమిదని, మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అశోక్ యాదవ్ తెలిపారు.