వీపు విరుపులతో... నాభీ నృత్యాలతో బాలీవుడ్ కుర్రకారునేకాక యావత్ భారతదేశ టీనేజ్ హృదయాలను దోచుకున్న సెక్సీ నవ్వుల మాధురీ దీక్షిత్ మళ్లీ వచ్చేసింది. తను నటించిన 'ఆజా నచ్లే' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాధురీ ముంబై సిఎస్టి విమానాశ్రయంలో అడుగుపెట్టింది.
'ఛోళీ కే పీఛే క్యా హై...' అంటూ ఎంతో వయ్యారంగా నడుము విరుపులను ప్రేక్షకులపైకి విసిరిన ఈ సెక్సీతార నటించిన ఈ తాజా చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యేవరకూ వేచి చూడాల్సిందే మరి.