తేజ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు తనయుడు
ఆదివారం, 18 నవంబర్ 2007( 12:03 IST )
కొత్తవారిని పరిచయం చేసే దర్శకునిగా పేరున్న తేజ తాజాగా మెగా నిర్మాత ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ను హీరోగా చేయబోతున్నారు. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని డిసెంబరు 14న ఆయన సెంటిమెంట్ ప్రకారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. తేజ దర్శకత్వంలో నటించిన ఉదయకిరణ్, నితిన్, నవదీప్.. జాబితాలో అశ్విన్ కూడా చేరబోతున్నాడు.