చంద్ర సిద్ధార్థ స్వీయ దర్శకత్వంతో అబ్బాస్, టబు నటిస్తోన్న చిత్రానికి "ఇదీ సంగతి" అనే పేరును ఖరారు చేశారు. దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్తమాన రాజకీయాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఈ చిత్రకథని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశం వినోదభరితంగా ఉంటుందని చెప్పారు.
ఈ చిత్రంలో టబు పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుందని అన్నారు. టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యిందని సిద్ధార్థ వెల్లడించారు. సంగీత దర్శకునిగా పరిచయమైన జాన్.పి.వర్కిన్ చిత్రంలోని ఐదుపాటలకు సంగీతం చక్కగా చేకూర్చారని చెప్పారు. ఇంకా మూడు పాటలను చిత్రీకరించి డిసెంబరులో పోస్ట్ప్రొడెక్షన్ కార్యక్రమాలను నిర్వహించి జనవరిలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
ఇందులో రాజా కూడా ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని... ఆయన సరసన మరోనటి నటించనుందని వివరించారు. ఈ చిత్రానికి కెమెరా: జె.కె. గుమ్మడి, కళ: నాగేంద్ర, పాటలు: చైతన్యప్రసాద్, పెద్దాడమూర్తి.