1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"న్యాయం" కోసం పోరాడుతున్న మిస్ జమ్మూ

కాశ్మీర్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
WD PhotoWD
కాశ్మీర్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "న్యాయం కావాలి". మిస్ జమ్మూగా ఎంపికైన అనారాగుప్త ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. నిజ జీవితంలో ఒక నీలి చిత్రం కేసులో చిక్కుకుని న్యాయం కోసం పోరాటం సాగిస్తున్న అనారాగుప్త కథను.. విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై సోమా విజయ్ ప్రకాష్ వెండితెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను అనారాగుప్త పోషించడం యాదృశ్చికం కావడం గమనార్హం.

ఆమెకు జోడీగా అమిత్ నటిస్తుండగా.. ఇతర పాత్రల్లో రాళ్ళపల్లి, కృష్ణభగవాన్, హేమసుందర్, ముఖేష్ తివారి, స్మితా జయకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మోడల్ ముసుగులో మునిగి పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువతకు ఓ కనువిప్పుగా ఉంటుందని నిర్మాత విజయ్ ప్రకాష్ అంటున్నారు. వచ్చే నెలల ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పుకుడు సిహెచ్.నాగేశ్వరరావు తెలిపారు.
About Writer
PNR