మొన్నటి వరకు "మిస్సమ్మ"గా కనిపించిన నటి భూమిక తాజాగా "అనసూయ"గా అవతారమెత్తింది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రెస్పై దర్శకుడు మాట్లాడుతూ.. చిత్ర కథ జర్నలిస్టు "అనసూయ" చుట్టూ తిరుగుతుంది. చిన్న పట్టణంలో పెరిగిన ఓ అనాథ యువతికి సామాజిక స్పృహ ఉండటంతో జర్నలిజంలోకి ప్రవేశిస్తుంది.
టీవీ రిపోర్టర్కు ఉండాల్సిన లక్షణాలు, అందం, ఆలోచనలు ఆమెలో పుష్కలంగా ఉండటంతో ఉద్యోగం వస్తుంది. తన ఉద్యోగ నిర్వహణలో ఆమెకు ఎదురైన అనుభవాల సమూహారమే ఈ చిత్ర కథ అని వివరించారు. అనంతరం చిత్ర హీరోయిన భూమిక మాట్లాడుతూ.. నా కెరీర్కు ఓ సవాల్ లాంటి పాత్రను పోషిస్తున్నాను. నాతో పాటు.. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.
కుటుంబ కథలకు భిన్నంగా సాగే కథ, కథనాలు ఉంటాయని, ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర సమర్పకుడు సురేష్ బాబు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో నిఖిత, అంకిత, హర్షవర్థన్, మేల్కొటే, రవిబాబు, రేవతి తదితరులు నటిస్తున్నారు.