1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నా కథ" ఆడియో విడుదల

తోయజ్
WD PhotoWD
తోయజ్, మంజుశ్రీ హీరోహీరోయిన్లుగా ఎ.సంజయ్ నిర్మాణ దర్శకత్వంలో నయనాంద క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "నా కథ". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఫిలించాంబర్‌లో తాజాగా జరిగింది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరించిన సీనియర్ నిర్మాత కేవివి.సత్యనారాయణ తొలి క్యాసెట్‌ను ఆర్పీ పట్నాయక్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత సంజయ్ మాట్లాడుతూ.. ఈ నాటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సాగే ఈ చిత్రానికి అమర్ సంగీత బాణీలు సమకూర్చినట్టు చెప్పారు. ఇప్పటికే.. ఈ బాణీలు తమను బాగా ఆకట్టుకున్నాయని, తప్పకుండా.. ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తాయని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
About Writer
PNR