శివాజీ-వైజయంతీల "సూపర్" కాంబినేషన్
|
దీనిపై నిర్మాత సి.అశ్వనీదత్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీరామారావు చేతుల మీదుగా ప్రారంభమైన తమ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో చిత్రాలను నిర్మించమన్నారు. గత 33 ఏళ్లలో 55 చిత్రాలను అందించిన ఘనత తమ సంస్థకు దక్కింది. అయితే రజనీకాంత్తో ఓ చిత్రాన్ని తీయాలనే కోరిక ఎప్పటి నుంచే ఉంది.
అది నేటికి ఫలించనుంది. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్తో చిత్రం తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కథ పరయుమ్' అనే చిత్ర కథను ఆధారంగా చేసుకుని సెవెన్ ఆర్ట్స్ జిపి.విజయకుమార్తో కలసి తెలుగులోకి రిమేక్ చేస్తున్నాం. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా ప్రైమ్ స్టార్ జగతిబాబుతో పాటు.. హాస్యనటుడు బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, తనికెళ్ల భరణి వంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారని వివరించారు.
అనంతరం దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ... ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించే ఈ చిత్రాన్ని రజనీకాంత్తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళ కథను తీసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్తో పాటు.. మలయాళ నటుడు శ్రీనివాసన్, సెవెన్ ఆర్ట్స్ అధినేత విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.