1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తల్లిదండ్రులకే ఈ చిత్రం అంకితం: బాపు బొమ్మ

తాను తాజాగా నటించిన
FileFILE
తాను తాజాగా నటించిన "సుందరకాండ" చిత్రాన్ని తన తల్లిదండ్రులు, తనను కూతురుగా చూసుకునే సత్యమూర్తిగారికి అంకితమిస్తున్నట్టు 'బాపుబొమ్మ'గా వెండితెరపై కనిపించనున్న ఛార్మీ పేర్కొంది. ఈ చిత్రంలో నటిస్తున్నపుడు తల్లిదండ్రుల ప్రాధాన్యత ఏమిటో బాగా తెలిసిందన్నారు. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో చైత్ర సినిమా పతాకంపై అనిల్ కుమార్ "సుందరకాండ"ను నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

గిన్నీస్ బుక్ రికార్డు నిర్మాత డి.రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రం ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. బాపు సినిమా అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత చిత్ర పోస్టర్లు చూస్తూనే తెలుస్తుంది. సంగీతపరంగా మంచి హిట్ సాధిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. యువ దర్శకుడు వివి.వినాయక్ మాట్లాడుతూ.. చిత్రం ఆడియో ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన నరేష్, ఛార్మీలు జీవితాంతం దాచుకోదగిన స్టిల్స్ ఈ చిత్రం ద్వారా లభిస్తాయన్నారు.

నటుడు నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం నా అదృష్టం. "కితకితలు" సినిమా చూసిన బాపుగారు నన్ను ఎంపిక చేసుకున్నారు. తాను ఎన్నో సినిమాలు చేశానని, అయితే ఈ చిత్ర షూటింగ్‌లోనే తొలిసారి స్టోరీ బోర్డ్‌ చూడటం ఆశ్చర్యమేసిందన్నారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న కొండవలస, వైజాగా ప్రసాద్, లక్ష్మీపతి, తదితరులు మాట్లాడుతూ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'సుందరకాండ' చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
About Writer
PNR