1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటా: "చిరుత"నయుడు

దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదని
FileFILE
దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదని, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, హితులుసన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటానని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ స్పష్టం చేశారు. తొలి చిత్రం "చిరుత" హీరోయిన్, ఢిల్లీ మోడల్ నేహా శర్మను ఢిల్లీలోని ఆర్యసమాజ్‌లో రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నట్టు శుక్రవారం వదంతులు వ్యాపించిన విషయం తెల్సిందే. వీటిపై భాగ్యనగరంతో పాటు.. ఇటు తమిళనాడు రాజధాని చెన్నైలోను తీవ్ర సంచలనం సృష్టించాయి. కొద్ది సేపు మీడియా ప్రతినిధులను ఉత్కంఠతకు గురి చేసి, చక్కర్లు కొట్టించాయి.

హైదరాబాద్‌లోని చిరంజీవి, ఆయన బావమర్థి అల్లు అరవింద్ నివాసాలు, విమానాశ్రయాల్లో భారీ సంఖ్యలో విలేకరులను మొహరించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమైన ఈ వదంతులు రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత తీరాచూస్తే... ‘చిరుత’ ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి కూల్‌గా వచ్చారు. ఆయన వెంట మరో హీరో, బావ మరిది అల్లు అర్జున్‌ కూడా పక్కనే ఉన్నారు. మీరు పెళ్లి చేసుకున్నారట కదా? అని పాత్రికేయులు చరణ్‌తేజను ప్రశ్నించగా.. ఇవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు.

‘సినిమా రంగంలో ఉన్నవారిపై గాసిప్స్ రావడం సహజమే. నాపై ఇవి ఎందుకు పుట్టించారో తెలియదు. వీటిని విని నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం’ కదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా.. నేను దొంగచాటుగా పెళ్లిచేసుకోవాల్సిన అగత్యం లేదు. అమ్మానాన్నలు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలోనే మీపై ఇలాంటి వార్తలు రావడానికి కారణమేమిటని విలేఖరులు ప్రశ్నించగా... అల్లు అర్జున్‌ కల్పించుకుని ‘సాధారణంగా పెద్ద హీరోలపై ఇలాంటి గాసిప్స్ రావడం మీకు తెల్సిందే' కదా అని విలేకరులకు చురక అంటించారు.
About Writer
PNR