గీతా ఆర్ట్స్ బ్యానర్లో "చిరుత"
Publish: Wed, 6 Feb 2008 (12:49 IST)
Updated: Wed, 6 Feb 2008 (12:48 IST)
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభంకానుంది. యువ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ను ప్రత్యేక కోణంలో చూపించనున్నారు. ప్రేమ, యాక్షన్ సెంటిమెంట్లతో మిళితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు దర్శకుడు శాయశక్తులా కృషి చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సరసన నటించే అందాల భామను, ఇతర తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది. అలాగే ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చవచ్చని రాజధాని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.