సావిత్రి సినిమా బేనర్ పతాకంపై హాస్యనటుడు వేణుమాధవ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ప్రేమాభిషేకం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా ఈ చిత్రం ఆడియోను "ప్రేమికుల రోజై"న ఈ నెల 14వ తేదీన విడుదలచేయనున్నట్టు వేణుమాధవ్ తెలిపారు. ఇప్పటికే ఓ క్రేజ్ను సంపాదించుకున్న ఈ చిత్రం తనకెంతో పేరుతెస్తుందని ఆయన అన్నారు.
చిత్ర దర్శకుడు విక్రమ్ గాంధీ మాట్లాడుతూ, ఇది పూర్తి వినోధభరిత చిత్రమన్నారు. దర్శకునిగా తనకెంతో గుర్తింపు తెస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటులు శ్రీహరి, నాగబాబు నటించడంతో ఈ చిత్రానికి కొత్త ఆకర్షణ వచ్చిందని పేర్కొన్నారు. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అనీ, వేణుమాధవ్ తనకు దర్శకునిగా అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకున్నారు.